'సన్నీ నైట్స్'కు సన్నీ కూడా రాదట!
- December 19, 2017
బెంగళూరు: కొత్త సంవత్సరాన్నిఆహ్వానించేందుకు బాలీవుడ్ నటి సన్నీలియోనీతో 'సన్నీ నైట్స్'ను నిర్వహిస్తున్నామని టైమ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. బెంగళూరులోని మాన్యత టెక్పార్కులో 'సన్నీ లియోనీ నైట్స్' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇందుకు బెంగళూరు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ అనుమతి ఇవ్వలేదు. గతంలో సన్నీ కేరళకు వెళ్లినప్పుడు అక్కడ అభిమానులు ఆమెను చుట్టుముట్టి, వాహనాలకు ఆటంకం కలిగించారని ఇప్పుడు కూడా ఇలాగే జరిగితే తాము బాధ్యులం కాదని పేర్కొన్నారు. దీనిపై తాజాగా సన్నీ ట్విటర్ ద్వారా స్పందించారు. కార్యక్రమం కన్నాతనకు ప్రజల క్షేమమే ముఖ్యమని తెలిపారు. 'బెంగళూరు పోలీసులు నాకు, ప్రజలకు భద్రత కల్పించలేమని చెప్పారు. నాకు ప్రజల క్షేమమే ముఖ్యం. కాబట్టి నేను కూడా ఆ కార్యక్రమానికి రావాలనుకోవడం లేదు.
గాడ్ బ్లెస్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని సన్నీ ట్వీట్లో పేర్కొన్నారు. శనివారం సునిల్ కుమార్ ప్రెస్మీట్ నిర్వహించి ఈ కార్యక్రమం గురించిమాట్లాడారు. పోలీసుల అనుమతి లేకుండా సన్నీ నైట్స్ను నిర్వహిస్తే నిర్వాహకులను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు.
దాంతో నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కార్యక్రమ నిర్వహణకు అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







