సమంత చేతిలో 'జీ ఛానల్'
- December 20, 2017
ఇటీవలే నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న సమంత , ప్రస్తుతం పెళ్లి కి ముందు ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది. వాటితో పాటు తాజాగా ఓ టీవీ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి సైన్ చేసింది. ప్రముఖ జీ ఛానల్ వారు తమ ఛానెల్ అంబాసిడర్ గా సమంత ను తీసుకున్నారు. ఈ మేరకు ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారట. దీనికి గాను అమ్మడు కోటి 50 లక్షల రూపాయలు పారితోషకం తీసుకుందని తెలుస్తుంది.
ఒప్పందం ప్రకారం ఛానెల్ లో పలు సీరియళ్లు, సినిమాలకు ప్రచారం కల్పించబోతోంది సమంత. ఆమెపై షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. లేటెస్ట్ గా విడుదలైన సమంత మోడ్రన్, ట్రెడిషనల్ లుక్స్ పిక్స్ ఆ యాడ్ లోనివేనట. ఇంతకు ముందు తమన్నా ఈ ఛానల్ కు అంబాసిడర్ గా ఉంది. ఆమెతో చేసుకున్న ఒప్పందం పూర్తి కావడం తో ఇప్పుడు సమంత ను తీసుకున్నారు.
ప్రస్తుతం సమంత రంగస్థలం, మహానటి సినిమాలు చేస్తోంది. వీటితో పాటు తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేస్తూ, రెండు యాడ్ లలో కూడా నటిస్తుంది. ఇవి పూర్తి అయిన తర్వాత తనే నిర్మాతగా ఓ సినిమా ప్లాన్ చేస్తుంది ఈ అమ్మడు. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత కూడా బాగా బిజీ అయిపొయింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







