కరీనా కుమారుడికి పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసిచ్చారు..!!
- December 21, 2017
ఉన్నవాడు ఉన్నవారికే పెడతాడు... లేని వాడు ఉన్నవాడికే పెడతాడు అనే సామెత.. ధనవంతుల ఇంట్లో , సెలబ్రిటీల ఇంట్లో ఫంక్షన్లు జరిగే సమయంలో గుర్తుకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ "పటౌడి" దంపతులైన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ మొదటి పుట్టిన రోజును బుధవారం అంగరంగ వైభవంగా నవాబ్ స్టైల్ లో జరుపుకొన్నాడు. ఈ వేడుకలను హరియాణాలోని రూ. 800 కోట్ల విలువైన పటౌడీ ప్యాలెస్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో కపూర్ కుటుంబం తో పాటు.. పటౌడీ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు.. కాగా కరీనా తో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పోషకాహార నిపుణురాలుగా వ్యవహరిస్తున్న రుజుతా దివాకర్... తైమూర్ కు పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసి ఇచ్చేసింది. ఈ విషయాన్ని రుజుత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. తైమూర్ పెద్దయ్యాక ఈ అడవిని చక్కగా సంరక్షిస్తాడని కామెంట్ కూడా జత చేస్తూ.. ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కాగా ఈ అడవి.. మహారాష్ట్ర పాల్ఘార్ ప్రాంతంలో సోనావే లో ఉన్న అడవి అని బీ టౌన్ వర్గ టాక్.. కాగా తైమూర్ పుట్టిన రోజు వేడుకల ఫోటోను కరీనా అక్క కరిష్మా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







