కరీనా కుమారుడికి పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసిచ్చారు..!!
- December 21, 2017
ఉన్నవాడు ఉన్నవారికే పెడతాడు... లేని వాడు ఉన్నవాడికే పెడతాడు అనే సామెత.. ధనవంతుల ఇంట్లో , సెలబ్రిటీల ఇంట్లో ఫంక్షన్లు జరిగే సమయంలో గుర్తుకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ "పటౌడి" దంపతులైన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ మొదటి పుట్టిన రోజును బుధవారం అంగరంగ వైభవంగా నవాబ్ స్టైల్ లో జరుపుకొన్నాడు. ఈ వేడుకలను హరియాణాలోని రూ. 800 కోట్ల విలువైన పటౌడీ ప్యాలెస్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో కపూర్ కుటుంబం తో పాటు.. పటౌడీ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు.. కాగా కరీనా తో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పోషకాహార నిపుణురాలుగా వ్యవహరిస్తున్న రుజుతా దివాకర్... తైమూర్ కు పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసి ఇచ్చేసింది. ఈ విషయాన్ని రుజుత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. తైమూర్ పెద్దయ్యాక ఈ అడవిని చక్కగా సంరక్షిస్తాడని కామెంట్ కూడా జత చేస్తూ.. ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కాగా ఈ అడవి.. మహారాష్ట్ర పాల్ఘార్ ప్రాంతంలో సోనావే లో ఉన్న అడవి అని బీ టౌన్ వర్గ టాక్.. కాగా తైమూర్ పుట్టిన రోజు వేడుకల ఫోటోను కరీనా అక్క కరిష్మా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









