కరీనా కుమారుడికి పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసిచ్చారు..!!
- December 21, 2017
ఉన్నవాడు ఉన్నవారికే పెడతాడు... లేని వాడు ఉన్నవాడికే పెడతాడు అనే సామెత.. ధనవంతుల ఇంట్లో , సెలబ్రిటీల ఇంట్లో ఫంక్షన్లు జరిగే సమయంలో గుర్తుకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ "పటౌడి" దంపతులైన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ మొదటి పుట్టిన రోజును బుధవారం అంగరంగ వైభవంగా నవాబ్ స్టైల్ లో జరుపుకొన్నాడు. ఈ వేడుకలను హరియాణాలోని రూ. 800 కోట్ల విలువైన పటౌడీ ప్యాలెస్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో కపూర్ కుటుంబం తో పాటు.. పటౌడీ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు.. కాగా కరీనా తో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పోషకాహార నిపుణురాలుగా వ్యవహరిస్తున్న రుజుతా దివాకర్... తైమూర్ కు పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసి ఇచ్చేసింది. ఈ విషయాన్ని రుజుత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. తైమూర్ పెద్దయ్యాక ఈ అడవిని చక్కగా సంరక్షిస్తాడని కామెంట్ కూడా జత చేస్తూ.. ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కాగా ఈ అడవి.. మహారాష్ట్ర పాల్ఘార్ ప్రాంతంలో సోనావే లో ఉన్న అడవి అని బీ టౌన్ వర్గ టాక్.. కాగా తైమూర్ పుట్టిన రోజు వేడుకల ఫోటోను కరీనా అక్క కరిష్మా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







