కరీనా కుమారుడికి పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసిచ్చారు..!!

- December 21, 2017 , by Maagulf
కరీనా కుమారుడికి పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసిచ్చారు..!!

ఉన్నవాడు ఉన్నవారికే పెడతాడు... లేని వాడు ఉన్నవాడికే పెడతాడు అనే సామెత.. ధనవంతుల ఇంట్లో , సెలబ్రిటీల ఇంట్లో ఫంక్షన్లు జరిగే సమయంలో గుర్తుకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ "పటౌడి" దంపతులైన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ మొదటి పుట్టిన రోజును బుధవారం అంగరంగ వైభవంగా నవాబ్ స్టైల్ లో జరుపుకొన్నాడు. ఈ వేడుకలను హరియాణాలోని రూ. 800 కోట్ల విలువైన పటౌడీ ప్యాలెస్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో కపూర్ కుటుంబం తో పాటు.. పటౌడీ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు.. కాగా కరీనా తో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పోషకాహార నిపుణురాలుగా వ్యవహరిస్తున్న రుజుతా దివాకర్... తైమూర్ కు పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసి ఇచ్చేసింది. ఈ విషయాన్ని రుజుత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. తైమూర్ పెద్దయ్యాక ఈ అడవిని చక్కగా సంరక్షిస్తాడని కామెంట్ కూడా జత చేస్తూ.. ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కాగా ఈ అడవి.. మహారాష్ట్ర పాల్ఘార్ ప్రాంతంలో సోనావే లో ఉన్న అడవి అని బీ టౌన్ వర్గ టాక్.. కాగా తైమూర్ పుట్టిన రోజు వేడుకల ఫోటోను కరీనా అక్క కరిష్మా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com