అగ్నికి దగ్ధమైన ఇల్లు ..... మంటలలో మాడి మసైన శిశువు
- December 21, 2017
మస్కట్ : ఓ పసిగుడ్డు మంటలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన వివరాల ప్రకారం, అల్-డాఖలీయా ప్రాంతం వద్ద నిజ్వా సౌక్ లో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరికొందరు వ్యక్తులు ఇంటి లోపల మంటలలో చిక్కుకున్నారని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వారు మంటలలో తీవ్రంగా గాయపడిన ఓ పసికందుని కనుగొన్నారు. దీంతో వారు అప్రమత్తమై అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించినట్లు అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపింది. ఇంటిలో అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించిందో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!