ఫిలిప్పైన్స్ ఫెర్రీ మునక: 4మంది మృతి
- December 22, 2017
మణిలా: 251 మందితో ప్రయాణిస్తున్న ఒక బోటు ఫిలిప్పైన్స్ తీరంలో మునిగిపోయిన ఘటనలో నలుగురు మరణించారని, మరో ఏడుగురి జాడ తెలియటం లేదని అధికారులు చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ బోటు రాజధాని మణిలా సమీపంలో మునిగిపోయిందని విపత్తు నిర్వహణా విభాగం, కోస్ట్గార్డ్ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు. ఈ ఫెర్రీ మునిగిన సమాచారం తెలుసుకున్న సమీప ప్రాంతాల మత్స్యకారులు, కోస్ట్గార్డ్ అధికారులు సహాయక బోట్లను పంపి దాదాపు 240 మందిని రక్షించారని ఆయన చెప్పారు.
క్విజోన్ ప్రావిన్స్లోని రియల్ టౌన్కు ఎనిమిది మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది సంఖ్య తేలే వరకూ గాలింపు, సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని కోస్ట్గార్డ్ ప్రతినిధి కెప్టెన్ అర్మాండ్ బలిలో చెప్పారు. రక్షించిన వారిలో అధికశాతం మందిని దినాషియాన్ రేవుకు చేర్చామని, మిగిలిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు మునిగిపోయారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం వేకువ సమయంలో రియల్ టౌన్ నుండి వస్తున్నపుడు ఈ ఫెర్రీ మునిగిపోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స