ఫిలిప్పైన్స్ ఫెర్రీ మునక: 4మంది మృతి
- December 22, 2017
మణిలా: 251 మందితో ప్రయాణిస్తున్న ఒక బోటు ఫిలిప్పైన్స్ తీరంలో మునిగిపోయిన ఘటనలో నలుగురు మరణించారని, మరో ఏడుగురి జాడ తెలియటం లేదని అధికారులు చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ బోటు రాజధాని మణిలా సమీపంలో మునిగిపోయిందని విపత్తు నిర్వహణా విభాగం, కోస్ట్గార్డ్ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు. ఈ ఫెర్రీ మునిగిన సమాచారం తెలుసుకున్న సమీప ప్రాంతాల మత్స్యకారులు, కోస్ట్గార్డ్ అధికారులు సహాయక బోట్లను పంపి దాదాపు 240 మందిని రక్షించారని ఆయన చెప్పారు.
క్విజోన్ ప్రావిన్స్లోని రియల్ టౌన్కు ఎనిమిది మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది సంఖ్య తేలే వరకూ గాలింపు, సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని కోస్ట్గార్డ్ ప్రతినిధి కెప్టెన్ అర్మాండ్ బలిలో చెప్పారు. రక్షించిన వారిలో అధికశాతం మందిని దినాషియాన్ రేవుకు చేర్చామని, మిగిలిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు మునిగిపోయారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం వేకువ సమయంలో రియల్ టౌన్ నుండి వస్తున్నపుడు ఈ ఫెర్రీ మునిగిపోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







