క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
- December 22, 2017
ఇంతకాలం పరాధీన స్థితిలో ఉన్న తెలంగాణ స్వాధీన స్థితిలోకి వచ్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుందని, గత పాలకుల హయాంలో ఇలాంటి క్రిస్మస్ వేడుకలు ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్నగరంలో జరిగిన కిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహించడంలేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ, బోనాల పండుగలు అధికారికంగా నిర్వహిస్తు న్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పాత చర్చిలకు మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణం కోసం పది కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే క్రిస్మస్ నాటికి హైదరాబాద్లో క్రైస్తవ భవన్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. దీనికి కావాల్సిన డిజైన్లు చివరి దశలో ఉన్నాయని, టెండర్లను పిలిచి క్రైస్తవ భవన్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ లేదనీ, ప్రజలకు మేలుచేసే ప్రతీ పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. మనం కలలుగన్న బంగారు తెలంగాణ ఎంతో దూరంలో లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు రావడంపై ఆయన ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పూర్తయితే త్వరలోనే రాష్ట్రం హరిత తెలంగాణగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృధ్ధి, వివిధ పండుగలను అధికారికంగా ప్రభుత్వం జరుపుతున్న తీరును పరిశీలించడంతో పాటు టూరిజం శాఖకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునేందుకు గానూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఈనెల 28న హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్కు సంబంధించిన ఒప్పందాలతో పాటు తెలంగాణ-జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య మరికొన్ని అంశాలపై ఒప్పందాలు ఉంటాయని సీఎం చెప్పారు.
అన్ని వర్గాల అందిన విధంగానే క్రిస్టియన్ సోదరులకు అభివృద్ధి ఫలాలు అందుతాయని, పింఛన్లు, స్కాలర్షిప్లు అందుతాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్ సోదరులపై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. జీసెస్ జన్మస్థలం జెరూసలేమ్కు రాష్ట్రం నుంచి వేళ్లే భక్తులకు సబ్సిడీ ఇవ్వాలని క్రిస్టియన్ సోదరులు కోరుతున్నారు, దీనిపై ప్రభుత్వం చర్చించి త్వరలో ఓ ప్రకటన చేయనుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







