ఖతార్లో బహ్రెయినీ సెయిలర్ అరెస్ట్
- December 23, 2017
మనామా: బహ్రెయినీ సెయిలర్ మరో ఇద్దరు ఖతారీ అథారిటీస్ స్వాధీనంలో ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి ప్రవేశించినట్లుగా ఆరోపిస్తోన్న ఖతార్, ఈ అరెస్టుల్ని ధృవీకరించింది. బహ్రెయిన్కి చెందిన 30 ఏళ్ళ ముస్తఫా హసన్, మరో ఇద్దరు బోటులో చేపలు పడుతుండగా, వారి బోట్లో ఫ్యూయల్ అయిపోవడంతో అనుకోకుండా ఖతార్ జలాల్లోకి ప్రవేశించారు. వీరిని నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఖతారీ కోస్ట్గార్డ్ టీమ్ అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. చేపలు పట్టేందుకోసం గత వారంలో వీరు బహ్రెయిన్లోని కోస్టల్ విలేజ్ ఆఫ్ అల్ దైర్ నుంచి వెళ్ళినట్లుగా బాధితుల బంధువులు పేర్కొన్నారు. మిగతా ఇద్దరు వ్యక్తుల్ని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు. ఖతారీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు అరెస్ట్ అయినవారిని ప్రవేశపెట్టి, అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగినట్లు సమాచారమ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







