మస్కట్ కొత్త ఎయిర్పోర్ట్ నుంచి తొలి విమానం టేకాఫ్
- December 23, 2017
మస్కట్: ఒమన్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబందించి కీలకమైన ముందడుగు వేసింది. తొలి ట్రయల్ ప్యాసింజర్ విమానాన్ని ఉదయం 11.15 నిమిషాలకు కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ చేయడం జరిగింది. ఒమన్ ఎయిర్ విమానం డబ్ల్యు వై 2001, ఎయిర్పోర్ట్ రన్ వే నుంచి పైకెగిరింది. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉందని ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఒకరు చెప్పారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటూ క్రూ మెంబర్స్ వివరించారు. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సిఇఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ జాబి ప్రారంభించారు. తొలి విమానానికి హఫెజ్ అల్ ఖట్టారి పైలట్గా వ్యవహరించారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్కి చెందిన పలువురు ప్రముఖులు, స్పెషలిస్ట్లు, మీడియా రిప్రెజెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







