మస్కట్ కొత్త ఎయిర్పోర్ట్ నుంచి తొలి విమానం టేకాఫ్
- December 23, 2017
మస్కట్: ఒమన్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబందించి కీలకమైన ముందడుగు వేసింది. తొలి ట్రయల్ ప్యాసింజర్ విమానాన్ని ఉదయం 11.15 నిమిషాలకు కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ చేయడం జరిగింది. ఒమన్ ఎయిర్ విమానం డబ్ల్యు వై 2001, ఎయిర్పోర్ట్ రన్ వే నుంచి పైకెగిరింది. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉందని ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఒకరు చెప్పారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటూ క్రూ మెంబర్స్ వివరించారు. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సిఇఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ జాబి ప్రారంభించారు. తొలి విమానానికి హఫెజ్ అల్ ఖట్టారి పైలట్గా వ్యవహరించారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్కి చెందిన పలువురు ప్రముఖులు, స్పెషలిస్ట్లు, మీడియా రిప్రెజెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







