తొలి హైడ్రోజన్ పవర్డ్ ట్యాక్సీ ట్రయల్ దుబాయ్లో
- December 23, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) తొలి ఎలక్ట్రానిక్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ టయోటా మిరాయ్ని దుబాయ్ ట్యాక్సీ ఫ్లీట్లో భాగంగా ట్రయల్ రన్ షురూ చేసింది. అల్ ఫుత్తైమ్ మోటార్స్ సహకారంతో ఈ వాహనాల్ని దుబాయ్ ట్యాక్సీ ఫ్లీట్లోకి చేర్చనున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, ఐషడరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్, ఈ ట్రయల్ రన్ని ప్రారంభించారు. హైడ్రోజన్ ఫ్యూయల్, జీరో ఎమిషన్స్ - ఓన్లీ వాటర్ ఎమిషన్స్ కాన్సెప్ట్తో రూపొందింది. ఈ వాహనం ఎలాంటి శబ్దాన్నీ చేయదు. ట్యాంక్ ఒక్కసారి ఫుల్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రీ-ఫిల్లింగ్ కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టయోటా సంస్థ ఈ కార్లను తయారు చేసింది. ట్యాక్సీ రంగంలో ఇదొక సంచలనం కాబోతోందని ఆర్టిఎ, టయోటా సంస్థల ప్రతినిథులు చెప్పారు. అల్ ఫుత్తైమ్ మోటార్స్ ఇటీవలే ఎయిర్ లిక్విడ్తో కలిసి సంయుక్తంగా తొలి హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్ని యూఏఈలో దుబాయ్ ఫెస్టివల్ సిటీ వద్ద ప్రారంభించింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!