దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి
- December 23, 2017
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో... సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చింది. లాలూకు జనవరి 3న శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. లాలూను దోషిగా ఖరారు చేయడంతో.. ఆయన్ను రాంఛీ జైలుకు తరలించారు.
దాణా కుంభకోణంలో అప్పటి బీహార్ సీఎం లాలూ, జగన్నాథ్ మిశ్రాలతో పాటు 22 మందిపై అభియోగాలు మోపారు. 1991-96 మధ్య కాలంలో దియోగఢ్ ట్రెజరీ నుంచి దాణా కోసం 89 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్టు... లాలూతో పాటు 34 మందిపై 1997లో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా, మిగిలిన వారు అప్రూవర్లుగా మారారు. అప్పుడు బీహార్లో ఉన్న దేవగఢ్ ఇప్పుడు జార్ఖండ్లో ఉంది.
చియబస ట్రెజరీ నుంచి 37.5 కోట్లు అక్రమంగా ఉపసంహరించిన కేసులోనూ లాలాకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలుతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. అంతేగాక.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైల్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇదే కేసులో జార్ఖండ్ హైకోర్టు 2014లో స్టే విధించింది. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది.
1996, జనవరి 27న దాణా కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దాణా పంపిణీ పేరిట మనుగడలో లేని కంపెనీలకు తరలించారని తేలింది. 1996 మార్చి 11న దాణా కుంభకోణంపై విచారించాలని సిబిఐకి పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. విచారణను పర్యవేక్షించేందుకు ఒక బెంచ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ, నేరారోపణల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీదేవిని బీహార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సిబిఐ కోర్టులో లాలూ ప్రసాద్ యాదవ్ లొంగిపోయారు. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన విచారణలో లాలూ ప్రసాద్ను దోషిగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వచ్చే నెల్లో ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.
తాజా వార్తలు
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి







