దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి
- December 23, 2017
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో... సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చింది. లాలూకు జనవరి 3న శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. లాలూను దోషిగా ఖరారు చేయడంతో.. ఆయన్ను రాంఛీ జైలుకు తరలించారు.
దాణా కుంభకోణంలో అప్పటి బీహార్ సీఎం లాలూ, జగన్నాథ్ మిశ్రాలతో పాటు 22 మందిపై అభియోగాలు మోపారు. 1991-96 మధ్య కాలంలో దియోగఢ్ ట్రెజరీ నుంచి దాణా కోసం 89 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్టు... లాలూతో పాటు 34 మందిపై 1997లో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా, మిగిలిన వారు అప్రూవర్లుగా మారారు. అప్పుడు బీహార్లో ఉన్న దేవగఢ్ ఇప్పుడు జార్ఖండ్లో ఉంది.
చియబస ట్రెజరీ నుంచి 37.5 కోట్లు అక్రమంగా ఉపసంహరించిన కేసులోనూ లాలాకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలుతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. అంతేగాక.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైల్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇదే కేసులో జార్ఖండ్ హైకోర్టు 2014లో స్టే విధించింది. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది.
1996, జనవరి 27న దాణా కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దాణా పంపిణీ పేరిట మనుగడలో లేని కంపెనీలకు తరలించారని తేలింది. 1996 మార్చి 11న దాణా కుంభకోణంపై విచారించాలని సిబిఐకి పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. విచారణను పర్యవేక్షించేందుకు ఒక బెంచ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ, నేరారోపణల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీదేవిని బీహార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సిబిఐ కోర్టులో లాలూ ప్రసాద్ యాదవ్ లొంగిపోయారు. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన విచారణలో లాలూ ప్రసాద్ను దోషిగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వచ్చే నెల్లో ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







