దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి
- December 23, 2017
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో... సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చింది. లాలూకు జనవరి 3న శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. లాలూను దోషిగా ఖరారు చేయడంతో.. ఆయన్ను రాంఛీ జైలుకు తరలించారు.
దాణా కుంభకోణంలో అప్పటి బీహార్ సీఎం లాలూ, జగన్నాథ్ మిశ్రాలతో పాటు 22 మందిపై అభియోగాలు మోపారు. 1991-96 మధ్య కాలంలో దియోగఢ్ ట్రెజరీ నుంచి దాణా కోసం 89 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్టు... లాలూతో పాటు 34 మందిపై 1997లో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా, మిగిలిన వారు అప్రూవర్లుగా మారారు. అప్పుడు బీహార్లో ఉన్న దేవగఢ్ ఇప్పుడు జార్ఖండ్లో ఉంది.
చియబస ట్రెజరీ నుంచి 37.5 కోట్లు అక్రమంగా ఉపసంహరించిన కేసులోనూ లాలాకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలుతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. అంతేగాక.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైల్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇదే కేసులో జార్ఖండ్ హైకోర్టు 2014లో స్టే విధించింది. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది.
1996, జనవరి 27న దాణా కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దాణా పంపిణీ పేరిట మనుగడలో లేని కంపెనీలకు తరలించారని తేలింది. 1996 మార్చి 11న దాణా కుంభకోణంపై విచారించాలని సిబిఐకి పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. విచారణను పర్యవేక్షించేందుకు ఒక బెంచ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ, నేరారోపణల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీదేవిని బీహార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సిబిఐ కోర్టులో లాలూ ప్రసాద్ యాదవ్ లొంగిపోయారు. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన విచారణలో లాలూ ప్రసాద్ను దోషిగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వచ్చే నెల్లో ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక