తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు...!!

- December 24, 2017 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు...!!

తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చ్‌లో అర్థరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. క్రీస్తు పుట్టినరోజు సందర్బంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. 176 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ చర్చ్ కు ప్రార్థనల కోసం వేలాదిగా తరలివచ్చారు. క్రిస్మస్ ప్రత్యేక ఏర్పాట్లతో, విద్యుద్దీపాల వెలుగులతో సెయింట్ మేరీస్ చర్చి వెలిగిపోయింది.

ప్రకాశం జిల్లాలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు, చీరాల, కందుకూరు.. ఇతర పట్టణాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జిరగాయి. క్యాండిల్ ప్రదర్శనలు, చిన్నారుల నృత్యరూపకాలు జరిగాయి. ఒంగోలు జేఎంటీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మాగుంట సహా వందలాది మంది పాల్గొన్నారు. అతిపురాతన జ్యువెల్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. 

ఏలూరులో కూడా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. నగరంలోని చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. అర్థరాత్రి 12 నుంచి కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com