ఒమన్లో వలసదారుల వీసా కోసం కొత్త 'ఇ-సర్వీస్'
- December 26, 2017
మస్కట్: మ్యాన్ పవర్ మినిస్ట్రీని సంప్రదించకుండానే యజమానులు వలస కార్మికుల్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా వన్ డే ఆన్లైన్ సర్వీస్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుల్తానేట్లో నివసిస్తోన్న నాన్ ఒమనీ వర్కర్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఈ సర్వీస్ వెసులుబాటు కల్పిస్తుంది. ఐదు రియాల్స్ ఫీజుతోనే ఈ సేవల్ని పొందడానికి వీలుంటుందని మినిస్ట్రీ ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. యజమాని ముందుగా ఇ-సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. 'మేన్ పవర్ సర్వీస్ ట్రాన్స్ఫర్'లో రిజిస్టర్ అయ్యాక, అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా సర్వీస్ అలర్ట్స్ యజమానికి సమాచారం అందుతుంది. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్లైన్ ద్వారా ఈ సేవలు పొందే వీలు కలగడం చాలా గొప్ప విషయమని ఓ ప్రైవేటు సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎస్ గుప్తా చెప్పారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









