ఒమన్లో వలసదారుల వీసా కోసం కొత్త 'ఇ-సర్వీస్'
- December 26, 2017
మస్కట్: మ్యాన్ పవర్ మినిస్ట్రీని సంప్రదించకుండానే యజమానులు వలస కార్మికుల్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా వన్ డే ఆన్లైన్ సర్వీస్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుల్తానేట్లో నివసిస్తోన్న నాన్ ఒమనీ వర్కర్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఈ సర్వీస్ వెసులుబాటు కల్పిస్తుంది. ఐదు రియాల్స్ ఫీజుతోనే ఈ సేవల్ని పొందడానికి వీలుంటుందని మినిస్ట్రీ ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. యజమాని ముందుగా ఇ-సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. 'మేన్ పవర్ సర్వీస్ ట్రాన్స్ఫర్'లో రిజిస్టర్ అయ్యాక, అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా సర్వీస్ అలర్ట్స్ యజమానికి సమాచారం అందుతుంది. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్లైన్ ద్వారా ఈ సేవలు పొందే వీలు కలగడం చాలా గొప్ప విషయమని ఓ ప్రైవేటు సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎస్ గుప్తా చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







