ఒమన్లో వలసదారుల వీసా కోసం కొత్త 'ఇ-సర్వీస్'
- December 26, 2017
మస్కట్: మ్యాన్ పవర్ మినిస్ట్రీని సంప్రదించకుండానే యజమానులు వలస కార్మికుల్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా వన్ డే ఆన్లైన్ సర్వీస్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుల్తానేట్లో నివసిస్తోన్న నాన్ ఒమనీ వర్కర్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఈ సర్వీస్ వెసులుబాటు కల్పిస్తుంది. ఐదు రియాల్స్ ఫీజుతోనే ఈ సేవల్ని పొందడానికి వీలుంటుందని మినిస్ట్రీ ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. యజమాని ముందుగా ఇ-సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. 'మేన్ పవర్ సర్వీస్ ట్రాన్స్ఫర్'లో రిజిస్టర్ అయ్యాక, అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా సర్వీస్ అలర్ట్స్ యజమానికి సమాచారం అందుతుంది. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్లైన్ ద్వారా ఈ సేవలు పొందే వీలు కలగడం చాలా గొప్ప విషయమని ఓ ప్రైవేటు సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎస్ గుప్తా చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







