'టచ్ చేసి చూడు' ఫస్ట్లుక్ విడుదల
- December 28, 2017
మాస్మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు. ఈ చిత్ర ఫస్ట్లుక్ ఈరోజు విడుదలైంది. ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్గా నడిచొస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోపక్క రవితేజ కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకి నేల టికెట్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఇందులో రవితేజకి జోడీగా మాళవిక శర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారట.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









