భార్యను గొంతు నులిమి చంపిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగుబాటు
- December 29, 2017కువైట్ : ఇటీవల సంచలనం కల్గించిన జహ్రా లోని తైమ ప్రాంతంలో 22 ఏళ్ల మహిళ హత్య కేసులో అనుమానితుడు హతురాలి భర్తను పోలీసులు అదుపులో తీసుకొన్నారు. తన భార్య తో కొన్ని సమస్యలు కలిగిఉన్నట్లు ఆ గొడవలు ఒక ప్రతిష్టంభన దశకు చేరుకున్నాయని ఆ నేపథ్యంలో ఆమెని తానె స్వయంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నాడు. అనుమానితుడు తన భార్యను జహ్రా క్లబ్ పార్కింగ్ స్థలంలోకి తీసుకువెళ్ళి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకొందామని యత్నించానని అయితే మా ఇరువురి మధ్య వాగ్యువాదం తీవ్ర స్థాయికి చేసారుకోవడంతో పట్టరాని కోపంతో తన భార్య గొంతు నులిమి చంపినట్లు డిటెక్టివ్లకు నిందితుడు చెప్పాడు. తన తండ్రి అంతర్గత వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడని తన భార్యతో ఏర్పడిన తగాదా గురించి చెప్పి మీ కోడలను చంపివేసినట్లు తన తండ్రికి చెప్పడం జరిగిందని..ఆయన సూచనతో తైమా పోలీసు స్టేషన్ వద్ద పోలీసులకు లొంగిపోయినట్లు నిందితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు