ఈజిఫ్ట్‌లో ఉగ్రదాడి..10 మంది మృతి

- December 29, 2017 , by Maagulf
ఈజిఫ్ట్‌లో ఉగ్రదాడి..10 మంది మృతి

కైరో: ఈజిఫ్ట్‌లో ఉగ్రవాదులు చర్చిని లక్ష్యంగా తీసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా..మరో ఎనిమిది మందికిపైగా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు గుంపుగా వచ్చి హెల్వాన్‌లోని చర్చిపై కాల్పులు జరిపారని, దాడిలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈజిప్ట్‌లో కాఫ్టిక్ సెలబ్రేషన్స్, ఆర్థోడాక్స్ క్రిస్మస్ డే (జనవరి 7న) నేపథ్యంలో ఉగ్రవాదులు చర్చిపై దాడులకు పాల్పడినట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com