అపర దానకర్ణుడు ఆ సౌదీ పౌరుడు... నెటిజన్ల ప్రశంసలు
- December 29, 2017
రియాధ్: గుప్పెడు గింజలు గుంపునకు ఇచ్చి... బారెడు ప్రచారం కోరుకొనే లోకంలో ఎవరో తెలియని ఒక బాలికకు కు తన మూత్రపిండం ఒక దానిని దానం చేశారా సౌదీ పౌరుడు. పదేళ్ల బాలిక నాలుగేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతోందని తెలిసి.. మహమ్మద్ జొమ్మాహ్ అల్ బొన్నా అనే 34 ఏళ్ల సౌదీ పౌరుడు తీవ్రంగా స్పందించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఆయన ఆమె గురించి తెలుసుకున్నాడు. చిన్న వయస్సులో పాడైన కిడ్నీ తో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బాధపడుతున్న విషయం తెల్సి బాధపడ్డాడు. ఓ సౌదీ దినపత్రికలో వచ్చిన ఓ మానవీయ కధనాన్ని చదివిన ఆయన నేరుగా ఆమె గురించి పూర్తి వివరాలను తెలుసుకుని... ఆసుపత్రికి వెళ్లి.. తన కిడ్నీని ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడు. తబుక్లోని కింగ్ సల్మాన్ అర్మ్డ్ ఫోర్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ బాలికకు కిడ్నీని ఇచ్చి సౌదీ వ్యాప్తంగా వార్హలలోని ప్రముఖ వ్యక్తి అయ్యాడు. నెటిజన్లు ఆయనను కీర్తిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన కూతురు ఇక దక్కదని అనుకున్నాననీ, తన ప్రాణాలపై ఆశలు కోల్పోతున్న తరుణంలో వచ్చి ఆదుకున్నాడని మహ్మద్ బొన్నాహ్ను పాప తండ్రి ముబారక్ అల్ ఏంజీ కీర్తించాడు. తన కుమార్తెకు రెండో జీవితాన్ని అందించాడని, ఆయన చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









