అపర దానకర్ణుడు ఆ సౌదీ పౌరుడు... నెటిజన్ల ప్రశంసలు
- December 29, 2017
రియాధ్: గుప్పెడు గింజలు గుంపునకు ఇచ్చి... బారెడు ప్రచారం కోరుకొనే లోకంలో ఎవరో తెలియని ఒక బాలికకు కు తన మూత్రపిండం ఒక దానిని దానం చేశారా సౌదీ పౌరుడు. పదేళ్ల బాలిక నాలుగేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతోందని తెలిసి.. మహమ్మద్ జొమ్మాహ్ అల్ బొన్నా అనే 34 ఏళ్ల సౌదీ పౌరుడు తీవ్రంగా స్పందించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఆయన ఆమె గురించి తెలుసుకున్నాడు. చిన్న వయస్సులో పాడైన కిడ్నీ తో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బాధపడుతున్న విషయం తెల్సి బాధపడ్డాడు. ఓ సౌదీ దినపత్రికలో వచ్చిన ఓ మానవీయ కధనాన్ని చదివిన ఆయన నేరుగా ఆమె గురించి పూర్తి వివరాలను తెలుసుకుని... ఆసుపత్రికి వెళ్లి.. తన కిడ్నీని ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడు. తబుక్లోని కింగ్ సల్మాన్ అర్మ్డ్ ఫోర్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ బాలికకు కిడ్నీని ఇచ్చి సౌదీ వ్యాప్తంగా వార్హలలోని ప్రముఖ వ్యక్తి అయ్యాడు. నెటిజన్లు ఆయనను కీర్తిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన కూతురు ఇక దక్కదని అనుకున్నాననీ, తన ప్రాణాలపై ఆశలు కోల్పోతున్న తరుణంలో వచ్చి ఆదుకున్నాడని మహ్మద్ బొన్నాహ్ను పాప తండ్రి ముబారక్ అల్ ఏంజీ కీర్తించాడు. తన కుమార్తెకు రెండో జీవితాన్ని అందించాడని, ఆయన చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







