రూ.230 కోట్లతో నాలాల విస్తరణ: మేయర్‌ రామ్ మోహన్

- December 29, 2017 , by Maagulf
రూ.230 కోట్లతో నాలాల విస్తరణ: మేయర్‌ రామ్ మోహన్

ఈ ఏడాది రూ. 230 కోట్లతో నాలాల విస్తరణ చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం ఆన్‌లైన్‌ సర్వీసులు ప్రారంభించామన్నారు. అలాగే 2.60లక్షల ఎల్‌ఈడీ దీపాలను అమర్చామని ఆయన అన్నారు. అలాగే లక్ష బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, దేశంలోని మెట్రో నగరాల్లో స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌లో అగ్రస్థానంలో ఉన్నామని మేయర్ తెలిపారు. అంతేగాక ఏరియా సభలు, వార్డు కమిటీల నియామకం పూర్తి చేశామని, రూ.43 కోట్లతో 117 జంక్షన్ల అభివృద్ధి, 40 మోడల్‌ మార్కెట్లు పూర్తిచేశామని మేయర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com