ఎడారిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన దుబాయ్ పోలీసులు

- December 30, 2017 , by Maagulf
ఎడారిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన దుబాయ్ పోలీసులు

దుబాయ్: చిమ్మ చీకటిలో ఎడారిలో చిక్కుకొని సహాయం కోసం అర్ధించే వ్యక్తిని దుబాయ్ పోలీసులు గుర్తించి రక్షించారు. జ్యూమరాలో ఇసుకలో మునిగిపోకుండా వ్యక్తిని దుబాయ్ పోలీసులు కాపాడగలిగారు. అల్ లిసిలీ ప్రాంతంలో  ఎడారి ఇసుకలో ఇరుక్కుపోయారు. వెనకకు ...ముందుకు కధల లేని పరిస్థితి. దాంతో ఆ వాహనం నడిపే వ్యక్తి శుక్రవారం పోలీసులను పిలిచారు. స్పందిన పోలీసులు వెంటనే హెలికాప్టర్ ద్వారా ఎడారిలో ఇరుక్కుపోయిన వ్యక్తి  కోసం వెతికేందుకు ఒక శోధన జట్టుని ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతాన్ని దర్యాప్తు చేసిన తరువాత, ఎడారిలో చిక్కుకుపోయిన వ్యక్తి స్థానాన్ని గుర్తించి, పోలీసుల తనిఖీ వాహనాలను అక్కడకు పంపి బాధితుడిని రక్షించారు. రెండు రోజుల క్రితం, కైట్ బీచ్ సమీపంల ఒక యూరోపియన్ పర్యాటకుడిని మునిగిపోకుండా దుబాయ్ పోలీసులు కాపాడగలిగేరు.. "అతను భారీ సముద్ర తరంగాలు తట్టుకుని అలసిపోయాడు, మరోవైపున లోతైన సుడిగుండాలు ఆ పర్యాటకుడిని వడిగా లాగుతూ ఉండగా దుబాయ్ పోర్ట్స్ లో సముద్ర రక్షణా విభాగం యొక్క నాయకుడు లియుత్ కల్ అలీ అల్ నక్బి గమనించాడు. దాంతో . రక్షించేందుకు అతన్ని చూసి అత్యవసర నెంబర్  999 అని పిలిచారు. "మేము ఎప్పుడూ జ్యూయిరా సమీపంలో గస్తీ తిరుగుతూ ఉంటాం ఇక్కడ సముద్రతీర ప్రాంతాలకు చాలా ప్రాచుర్యం పొందింది, అందుచే వెంటనే ఒక ప్రమాదం నుంచి రక్షించే పడవ బోటు మరియు ఇద్దరు నీటిలో మునిగి ఈతకొట్టే గజ ఈతగాళ్లను  సముద్రంలోకి తీసుకెళ్లి రక్షించినట్లు తెలిపారు. ఆ యూరోపియన్ పర్యాటకుడికి నీటి నుండి బయటకు లాగిన వెంటనే, ప్రథమ చికిత్స జరిపించడంతో  కోలుకున్నాడు. "ఈ రక్షణ ప్రక్రియ రెండు నిమిషాలు పట్టింది; మా స్పందన సమయం ఆరు నిముషాలు మించకూడదు మరియు అయితే  మేము ఆ గడువును ఎన్నడూ దాటలేదని ఎందుకంటే ఎన్నో రక్షణా కేంద్రాలు సదా అప్రమత్తంతో ఉంటాయని ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com