ఎడారిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన దుబాయ్ పోలీసులు
- December 30, 2017
దుబాయ్: చిమ్మ చీకటిలో ఎడారిలో చిక్కుకొని సహాయం కోసం అర్ధించే వ్యక్తిని దుబాయ్ పోలీసులు గుర్తించి రక్షించారు. జ్యూమరాలో ఇసుకలో మునిగిపోకుండా వ్యక్తిని దుబాయ్ పోలీసులు కాపాడగలిగారు. అల్ లిసిలీ ప్రాంతంలో ఎడారి ఇసుకలో ఇరుక్కుపోయారు. వెనకకు ...ముందుకు కధల లేని పరిస్థితి. దాంతో ఆ వాహనం నడిపే వ్యక్తి శుక్రవారం పోలీసులను పిలిచారు. స్పందిన పోలీసులు వెంటనే హెలికాప్టర్ ద్వారా ఎడారిలో ఇరుక్కుపోయిన వ్యక్తి కోసం వెతికేందుకు ఒక శోధన జట్టుని ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతాన్ని దర్యాప్తు చేసిన తరువాత, ఎడారిలో చిక్కుకుపోయిన వ్యక్తి స్థానాన్ని గుర్తించి, పోలీసుల తనిఖీ వాహనాలను అక్కడకు పంపి బాధితుడిని రక్షించారు. రెండు రోజుల క్రితం, కైట్ బీచ్ సమీపంల ఒక యూరోపియన్ పర్యాటకుడిని మునిగిపోకుండా దుబాయ్ పోలీసులు కాపాడగలిగేరు.. "అతను భారీ సముద్ర తరంగాలు తట్టుకుని అలసిపోయాడు, మరోవైపున లోతైన సుడిగుండాలు ఆ పర్యాటకుడిని వడిగా లాగుతూ ఉండగా దుబాయ్ పోర్ట్స్ లో సముద్ర రక్షణా విభాగం యొక్క నాయకుడు లియుత్ కల్ అలీ అల్ నక్బి గమనించాడు. దాంతో . రక్షించేందుకు అతన్ని చూసి అత్యవసర నెంబర్ 999 అని పిలిచారు. "మేము ఎప్పుడూ జ్యూయిరా సమీపంలో గస్తీ తిరుగుతూ ఉంటాం ఇక్కడ సముద్రతీర ప్రాంతాలకు చాలా ప్రాచుర్యం పొందింది, అందుచే వెంటనే ఒక ప్రమాదం నుంచి రక్షించే పడవ బోటు మరియు ఇద్దరు నీటిలో మునిగి ఈతకొట్టే గజ ఈతగాళ్లను సముద్రంలోకి తీసుకెళ్లి రక్షించినట్లు తెలిపారు. ఆ యూరోపియన్ పర్యాటకుడికి నీటి నుండి బయటకు లాగిన వెంటనే, ప్రథమ చికిత్స జరిపించడంతో కోలుకున్నాడు. "ఈ రక్షణ ప్రక్రియ రెండు నిమిషాలు పట్టింది; మా స్పందన సమయం ఆరు నిముషాలు మించకూడదు మరియు అయితే మేము ఆ గడువును ఎన్నడూ దాటలేదని ఎందుకంటే ఎన్నో రక్షణా కేంద్రాలు సదా అప్రమత్తంతో ఉంటాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!