ఒమన్లో షారుక్: మర్చిపోలేని అనుభూతి
- December 30, 2017
మస్కట్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ఖాన్, కళ్యాణ్ జ్యుయెలర్స్కి చెందిన పలు శాఖల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున అభిమానులు ఆయన్ని చూసేందుకు వచ్చారు. ఇండియన్ ఫిలిం యాక్టర్స్ నాగార్జున, ప్రభు గణేశన్, మంజు వారియర్ తదితరులు ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కళ్యాణ్ జ్యుయెలర్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎస్ కళ్యాణరామ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ రాజేష్ కళ్యాణరామ్, రమేష్ కళ్యాణ్రామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ, ఒమన్లో కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూమ్స్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, విదేశాల్లో అభిమానుల్ని ఎప్పుడు కలుసుకున్నా కొత్త ఉత్సాహం వస్తుందని అన్నారు. సుల్తానేట్లో ఇంత గొప్ప ప్రారంభోత్సవాలు జరపడం గర్వంగా ఉందని కళ్యాణ్ జ్యుయెలర్స్ అధినేత తెలిపారు. ప్రారంభోత్సవ ఆఫర్స్లో భాగంగా ఫ్రీ గిఫ్ట్స్ని కొనుగోళ్ళపై అందిస్తున్నారు. తమ బ్రాండ్ అంబాసిడర్స్ చాలా పాపులారిటీ ఉన్నవారనీ, వారి ద్వారా వినియోగదారులకు భరోసా ఇస్తోన్న తాము ఈ రంగంలో చిత్తశుద్ధితో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నామని కళ్యాణరామన్ చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







