కిటకిటలాడుతున్న దుబాయ్ మాల్స్
- December 31, 2017
దుబాయ్: గత ఏడాది భారతదేశంలో వెయ్యి , అయిదు వందల రూపాయల నోట్లు రద్దు అవుతుంటే ప్రజలు పలు బ్యాంకుల ముందు ఎలా బారులు తీరారో అలానే దుబాయ్ లో గత రెండు రోజులుగా నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాల ముందు కిక్కిరిసి ఉన్నారు. రేపు జనవరి 1 వ తేదీ నుంచి విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) అమలవుతున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని సరుకులు కొనుగోలు చేయడం మంచిదని నిత్యావసరాలు నిల్వ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో పలువురు వినియోగదారులు దుకాణాలవైపు పరుగులుతీస్తున్నారు. రొట్టెలు పాలు పండ్లు కూరగాయలు తదితర ఆహారవస్తువులపై 75 శాతం డిస్కౌంట్ ఉందని వారు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ప్రభుత్వం వ్యాట్ అమలుచేయబోతోందని దాంతో ఇంత కారుచౌకగా సరుకులు లభ్యం కావని వారు చెప్పారు. అయితే ప్రజలు ఎక్కువగా ఎల్ ఇ డి టీవీలు .. మైక్రో ఓవెన్లు ...వాషింగ్ మెషీన్లు..రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైపర్ మార్కెట్స్ నుంచి చిన్న షాపింగ్ మాల్ అన్ని వినియోగదారులతో కిటకిటలాడిపోతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







