కిటకిటలాడుతున్న దుబాయ్ మాల్స్

- December 31, 2017 , by Maagulf
కిటకిటలాడుతున్న దుబాయ్ మాల్స్

దుబాయ్: గత ఏడాది  భారతదేశంలో వెయ్యి , అయిదు వందల రూపాయల నోట్లు రద్దు అవుతుంటే ప్రజలు పలు బ్యాంకుల ముందు ఎలా బారులు తీరారో అలానే దుబాయ్ లో గత రెండు రోజులుగా నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాల ముందు కిక్కిరిసి ఉన్నారు. రేపు జనవరి 1 వ తేదీ నుంచి విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ )  అమలవుతున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని సరుకులు కొనుగోలు చేయడం మంచిదని నిత్యావసరాలు నిల్వ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో పలువురు వినియోగదారులు దుకాణాలవైపు పరుగులుతీస్తున్నారు. రొట్టెలు పాలు పండ్లు కూరగాయలు తదితర ఆహారవస్తువులపై  75 శాతం డిస్కౌంట్‌ ఉందని వారు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ప్రభుత్వం వ్యాట్ అమలుచేయబోతోందని దాంతో ఇంత కారుచౌకగా సరుకులు లభ్యం కావని  వారు చెప్పారు. అయితే ప్రజలు ఎక్కువగా ఎల్ ఇ డి  టీవీలు .. మైక్రో ఓవెన్లు ...వాషింగ్ మెషీన్లు..రిఫ్రిజిరేటర్లు తదితర   ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైపర్ మార్కెట్స్ నుంచి చిన్న షాపింగ్ మాల్ అన్ని వినియోగదారులతో కిటకిటలాడిపోతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com