అజ్ఞాతవాసి సెన్సార్ రిపోర్ట్ !
- January 01, 2018
పవన్ అభిమానులు మాత్రమే కాకుండా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'అజ్ఞాతవాసి' సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని U/A సర్టిఫికేట్ పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో ఎమోషనల్ సెంటిమెంట్ తో పాటు అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో సెన్సార్ వర్గాలు U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బయటకు వస్తున్న సెన్సార్ టాక్ ప్రకారం ఈమూవీలో పవన్ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తోంది.
ముఖ్యంగా త్రివిక్రమ్ మాటలు మైండ్ వరకు వెళ్లి గుండెల్ని తకుతాయట. త్రివిక్రమ్ ప్రతి ఫ్రెమ్ ని చాలా వినోదాత్మకంగా తెరకక్కించడమే కాకుండా మంచి మెస్సేజ్ ఈసినిమాలో ఇచ్చాడని సెన్సార్ వర్గాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ ఈసినిమాను తీసినదుకు సెన్సార్ బోర్డ్ సభ్యులు త్రివిక్రమ్ ను అభినందించినట్లు టాక్.
పవన్ తో పాటు ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ కూడా ఈసినిమాకు హైలెట్ గా మారుతుంది అని అభిప్రాయ పడుతూ ఈమూవీలోని ఫైట్ సీన్స్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం అని సెన్సార్ సభ్యులు అభిప్రాయ పడినట్లు టాక్. ఇక ఈమూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈమూవీ ఓవర్సీస్ కు పంపించవలసిన కాపీలు లోడ్ చేసే కార్యక్రమం ప్రారంభం ఐనట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన కొత్త కొత్త పోస్టర్స్ ను ప్రతిరోజు విడుదల చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేసే ఎత్తుగడలో ఈసినిమా యూనిట్ ప్రస్తుతం ఉంది.
నిన్న పవన్ కేసిఆర్ ను కూడ కలిసి ఆయన అనుసరిస్తున్న విధానాలకు మద్దతు తెలిపిన నేపధ్యంలో 'అజ్ఞాతవాసి' ప్రీమియర్ షోల విషయంలో తెలంగాణ ప్రాంతంలో ఇక ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఒకవైపు అజ్ఞాతవాసి' మ్యానియా మరొకవైపు పవన్ రాజకీయ దూకుడు వేగంగా ఉన్న నేపధ్యంలో ప్రస్తుతం సినిమా రాజకీయ వర్గాలలో అత్యంత హాట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ మారిపోయాడు..
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









