పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 48మంది మృతి
- January 02, 2018
లిమా: పెరూలో ఘోర బస్సు ప్రమాదం సంభవించి 48 మంది మృత్యువాతపడ్డారు. పెరూ రాజధాని లిమాకు 57 మందితో ప్రయాణిస్తున్న బస్సు.. ట్రక్కుకు ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్సు ఎత్తైన కొండ ప్రాంతం నుంచి కిందకు పడిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన పసమాయో ప్రాంతం చాలా ప్రమాదకరమైన కొండ అంచు ఇరుకైన రోడ్డు కావడంతో ఈ హైవేను డెవిల్ కర్వ్ అని అంటారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో విచారం వ్యక్తంచేశారు. పెరూలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2016లో రోడ్డు ప్రమాదాల కారణంగా 2600 మంది మరణించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







