పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 48మంది మృతి
- January 02, 2018
లిమా: పెరూలో ఘోర బస్సు ప్రమాదం సంభవించి 48 మంది మృత్యువాతపడ్డారు. పెరూ రాజధాని లిమాకు 57 మందితో ప్రయాణిస్తున్న బస్సు.. ట్రక్కుకు ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్సు ఎత్తైన కొండ ప్రాంతం నుంచి కిందకు పడిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన పసమాయో ప్రాంతం చాలా ప్రమాదకరమైన కొండ అంచు ఇరుకైన రోడ్డు కావడంతో ఈ హైవేను డెవిల్ కర్వ్ అని అంటారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో విచారం వ్యక్తంచేశారు. పెరూలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2016లో రోడ్డు ప్రమాదాల కారణంగా 2600 మంది మరణించారు.
తాజా వార్తలు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్









