ఇండియా:రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- January 03, 2018
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ సొంతంగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తేనుంది. అందుకోసం ఎస్బీఐతో రైల్వే శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటే.. నెలలో ఒకసారి లాటరీ తీసి పది మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్బ్యాక్ను అందించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









