ఇండియా:రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- January 03, 2018
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ సొంతంగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తేనుంది. అందుకోసం ఎస్బీఐతో రైల్వే శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటే.. నెలలో ఒకసారి లాటరీ తీసి పది మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్బ్యాక్ను అందించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







