ఇండియా:రైల్వే ప్రయాణికులకు శుభవార్త

- January 03, 2018 , by Maagulf
ఇండియా:రైల్వే ప్రయాణికులకు శుభవార్త

న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ సొంతంగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తేనుంది. అందుకోసం ఎస్‌బీఐతో రైల్వే శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటే.. నెలలో ఒకసారి లాటరీ తీసి పది మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com