అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్: 11మంది మృతి
- January 03, 2018
వాషింగ్టన్: అమెరికాను మరో తుఫాను వణికిస్తోంది. బాంబు సైక్లోన్ ఇప్పటికే 11 మంది ప్రాణాలు తీసింది. ఈ సైక్లోన్ ప్రభావం ఎక్కువగా తూర్పు తీరం ప్రాంతంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అధికార వర్గాలు అప్రమత్తం చేశాయి.
అమెరికాలోని 24 తీర ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నీరు గడ్డపడిపోతుండటం గమనార్హం.
చలితోపాటు వేడి గాలులు కూడా పలు ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బుధవారం చలి తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం బాంబ్ సైక్లోన్ ప్రభావం మరింత తీవ్రంగా ఉండదనుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







