అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్: 11మంది మృతి

- January 03, 2018 , by Maagulf
అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్: 11మంది మృతి

వాషింగ్టన్: అమెరికాను మరో తుఫాను వణికిస్తోంది. బాంబు సైక్లోన్ ఇప్పటికే 11 మంది ప్రాణాలు తీసింది. ఈ సైక్లోన్ ప్రభావం ఎక్కువగా తూర్పు తీరం ప్రాంతంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అధికార వర్గాలు అప్రమత్తం చేశాయి.

అమెరికాలోని 24 తీర ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నీరు గడ్డపడిపోతుండటం గమనార్హం.

చలితోపాటు వేడి గాలులు కూడా పలు ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బుధవారం చలి తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం బాంబ్ సైక్లోన్ ప్రభావం మరింత తీవ్రంగా ఉండదనుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com