రేపు జరగనున్న అరేబియా గల్ఫ్ కప్ ఫైనల్ పోటీలు
- January 04, 2018
కువైట్: శుక్రవారం జరగనున్న అరబ్ గల్ఫ్ కప్ తుది పోటీలలో యూఏఈ క్రీడాకారులకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ ఫుట్బాల్ జట్టు కువైట్ క్రీడాభిమానులకు ఉచిత టికెట్లను అందచేశారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధ్యక్షుడు షేఖ్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్, షైక్ మహ్మద్ సూచనల ప్రకారం దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీజోన్ అథారిటీ (దఫజా ), అరేబియా గల్ఫ్ కప్ ఫైనల్ కు హాజరు కావడానికి యూఏఈ మద్దతుదారుల కోసం కువైట్ కు ఏ 380 ఒక ప్రత్యేక విమానాన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తుందని ధ్రువీకరించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో యూఏఈ జట్టు ఓమాన్ జట్టుని ఎదుర్కొంటుంది. రేపు జనవరి 5 వ తేదీ శుక్రవారం ఈ తుదిపోరు జరగనుంది. యూఏఈ 2007 మరియు 2013 రెండుసార్లు టోర్నమెంట్ గెలిచింది. మూడు సందర్భాలలో రెండుసార్లు ద్వితీయ స్థానంలో (రన్నర్స్ అప్ గా) నిలిచింది. మంగళవారం జబెర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వేలాది మంది సాకర్ అభిమానుల సమక్షంలో జరిగిన 23 వ అరబిక్ గల్ఫ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లను వీక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







