రేపు జరగనున్న అరేబియా గల్ఫ్ కప్ ఫైనల్ పోటీలు
- January 04, 2018
కువైట్: శుక్రవారం జరగనున్న అరబ్ గల్ఫ్ కప్ తుది పోటీలలో యూఏఈ క్రీడాకారులకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ ఫుట్బాల్ జట్టు కువైట్ క్రీడాభిమానులకు ఉచిత టికెట్లను అందచేశారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధ్యక్షుడు షేఖ్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్, షైక్ మహ్మద్ సూచనల ప్రకారం దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీజోన్ అథారిటీ (దఫజా ), అరేబియా గల్ఫ్ కప్ ఫైనల్ కు హాజరు కావడానికి యూఏఈ మద్దతుదారుల కోసం కువైట్ కు ఏ 380 ఒక ప్రత్యేక విమానాన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తుందని ధ్రువీకరించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో యూఏఈ జట్టు ఓమాన్ జట్టుని ఎదుర్కొంటుంది. రేపు జనవరి 5 వ తేదీ శుక్రవారం ఈ తుదిపోరు జరగనుంది. యూఏఈ 2007 మరియు 2013 రెండుసార్లు టోర్నమెంట్ గెలిచింది. మూడు సందర్భాలలో రెండుసార్లు ద్వితీయ స్థానంలో (రన్నర్స్ అప్ గా) నిలిచింది. మంగళవారం జబెర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వేలాది మంది సాకర్ అభిమానుల సమక్షంలో జరిగిన 23 వ అరబిక్ గల్ఫ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లను వీక్షించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







