పీబీఎల్: చెన్నై స్మాషర్స్ను గెలిపించిన పీవీ సింధు
- January 06, 2018
హైదరాబాద్: మహిళల సింగిల్స్తో పాటు నిర్ణయాత్మక మిక్స్డ్ డబుల్స్ పోరులో సింధు రాణించడంతో చెన్నై స్మాషర్స్ విజయం సాధించింది. ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శనివారం చెన్నై స్మాషర్స్ జట్టు 2-1తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్పై విజయం సాధించింది.
మొదట పురుషుల డబుల్స్లో రెకినాల్డ్-నందగోపాల్ జంట 15-13, 15-12తో క్రిస్ అడకాక్- యాంగ్లీ జోడీపై నెగ్గడంతో అహ్మదాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్లో సింధు 15-11, 10-15, 15-12తో ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (అహ్మదాబాద్)పై గెలవడంతో చెన్నై స్కోరు సమం చేసింది.
మూడో మ్యాచ్ను చెన్నై ట్రంప్ మ్యాచ్గా ఎంచుకోగా.. ఆ జట్టు ఆటగాడు లెవెర్డెజ్ 15-12, 12-15, 14-15తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయాడు. అయితే చెన్నై చివరి రెండు మ్యాచ్ల్లో పుంజుకుని పోరులో విజేతగా నిలిచింది. మరో సింగిల్స్ అహ్మదాబాద్కు 'ట్రంప్' కాగా... తనోంగ్సక్ (చెన్నై) 15-10, 12-15, 15-14తో ప్రణయ్పై గెలుపొందాడు.
స్కోరు 1-1తో సమంగా నిలిచిన ఈ దశలో పీవీ సింధు, సుమీత్ రెడ్డి జోడీ 15-14, 15-13తో రెగినాల్డ్- కమిలా జుల్ (అహ్మదాబాద్) జంటను ఓడించింది. దీంతో చెన్నై స్మాషర్స్ జట్టు 2-1తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్పై నెగ్గింది. ఆదివారం జరిగే పోరులో హైదరాబాద్ హంటర్స్తో అవధె వారియర్స్ తలపడుతుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!