ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- November 04, 2025
తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను మంగళవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, వసతి, వైద్యం, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలను టిటిడి ఈవోకు ఇంఛార్జీ డైరెక్టర్ డి.పణికుమార్ నాయుడు వివరించారు. దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించారు.గోశాలలో పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తిల యూనిట్ వంటి కార్యాకలాపాలను ఈవో పరిశీలించారు. గోశాల, అగరబత్తిల యూనిట్ లోని సిబ్బందితో ఈవో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు







