ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో

- November 04, 2025 , by Maagulf
ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను మంగళవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, వసతి, వైద్యం, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలను టిటిడి ఈవోకు ఇంఛార్జీ డైరెక్టర్ డి.పణికుమార్ నాయుడు వివరించారు. దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించారు.గోశాలలో పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తిల యూనిట్ వంటి కార్యాకలాపాలను ఈవో పరిశీలించారు. గోశాల, అగరబత్తిల యూనిట్ లోని సిబ్బందితో ఈవో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com