ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- November 04, 2025
            దోహా: ఖతార్ లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో అధ్యక్షుడు మరియు నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ నాజర్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా తెలిపారు. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి రేటు 58 శాతం నుండి 86 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు.
నవంబర్ 4 నుండి 6 వరకు ఖతార్ నిర్వహిస్తున్న రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి స్థాయిని 90 శాతానికి పైగా పెంచడానికి కృషి చేయనున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ సేవలపై ఫీడ్ బ్యాక్ అందించేందుకు వేదిక అయిన “షేరెక్” ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించడాన్ని నియంత్రించే మానవ వనరుల చట్టం మరియు పౌర సేవా చట్టానికి చేసిన సంస్కరణల్లో భాగంగా ఈ వేదికను రూపొందించినట్టు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







