ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- November 04, 2025
దోహా: ఖతార్ లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో అధ్యక్షుడు మరియు నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ నాజర్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా తెలిపారు. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి రేటు 58 శాతం నుండి 86 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు.
నవంబర్ 4 నుండి 6 వరకు ఖతార్ నిర్వహిస్తున్న రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి స్థాయిని 90 శాతానికి పైగా పెంచడానికి కృషి చేయనున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ సేవలపై ఫీడ్ బ్యాక్ అందించేందుకు వేదిక అయిన “షేరెక్” ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించడాన్ని నియంత్రించే మానవ వనరుల చట్టం మరియు పౌర సేవా చట్టానికి చేసిన సంస్కరణల్లో భాగంగా ఈ వేదికను రూపొందించినట్టు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







