ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- November 04, 2025
దోహా: ఖతార్ లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో అధ్యక్షుడు మరియు నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ నాజర్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా తెలిపారు. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి రేటు 58 శాతం నుండి 86 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు.
నవంబర్ 4 నుండి 6 వరకు ఖతార్ నిర్వహిస్తున్న రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి స్థాయిని 90 శాతానికి పైగా పెంచడానికి కృషి చేయనున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ సేవలపై ఫీడ్ బ్యాక్ అందించేందుకు వేదిక అయిన “షేరెక్” ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించడాన్ని నియంత్రించే మానవ వనరుల చట్టం మరియు పౌర సేవా చట్టానికి చేసిన సంస్కరణల్లో భాగంగా ఈ వేదికను రూపొందించినట్టు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









