సెన్సార్ పూర్తి చేసుకొన్న "ఇగో"
- January 09, 2018
"ఆకతాయి" ఫేమ్ ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఇవాళ పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ అందుకొన్న "ఇగో" చిత్రాన్ని జనవరి 19న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "హిలేరియస్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం "ఇగో". నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతరంతోపాటు పెద్దలకు కూడా నచ్చేలా సినిమా ఉంటుంది. ఆశీష్ రాజ్ హీరోగా ఒక మెట్టు ఎక్కుతాడు. సిమ్రాన్, దీక్షా పంత్ ల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. అలాగే సాయికార్తీక్ సమకూర్చిన నేపధ్య సంగీతం సినిమాకి హెల్ప్ అవుతుంది. ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చి మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









