సెన్సార్ పూర్తి చేసుకొన్న "ఇగో"
- January 09, 2018
"ఆకతాయి" ఫేమ్ ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఇవాళ పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ అందుకొన్న "ఇగో" చిత్రాన్ని జనవరి 19న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "హిలేరియస్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం "ఇగో". నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతరంతోపాటు పెద్దలకు కూడా నచ్చేలా సినిమా ఉంటుంది. ఆశీష్ రాజ్ హీరోగా ఒక మెట్టు ఎక్కుతాడు. సిమ్రాన్, దీక్షా పంత్ ల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. అలాగే సాయికార్తీక్ సమకూర్చిన నేపధ్య సంగీతం సినిమాకి హెల్ప్ అవుతుంది. ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చి మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







