సెన్సార్ పూర్తి చేసుకొన్న "ఇగో"
- January 09, 2018
"ఆకతాయి" ఫేమ్ ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఇవాళ పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ అందుకొన్న "ఇగో" చిత్రాన్ని జనవరి 19న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "హిలేరియస్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం "ఇగో". నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతరంతోపాటు పెద్దలకు కూడా నచ్చేలా సినిమా ఉంటుంది. ఆశీష్ రాజ్ హీరోగా ఒక మెట్టు ఎక్కుతాడు. సిమ్రాన్, దీక్షా పంత్ ల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. అలాగే సాయికార్తీక్ సమకూర్చిన నేపధ్య సంగీతం సినిమాకి హెల్ప్ అవుతుంది. ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చి మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







