కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

- January 11, 2018 , by Maagulf
కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

దిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. ఎస్‌ఎన్‌సీ-లావలిన్‌ అవినీతి కేసులో ఆయనకు నోటీసులు పంపింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో సీబీఐ చేసిన అప్పీల్‌ను వినడానికి అంగీకరించింది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం అవసరమని, నిందితులందరికీ నోటీసులు పంపాలని సీబీఐ తరపు న్యాయవాది.. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరారు. సీబీఐ చేసిన అప్పీలును అంగీకరించిన కోర్టు నాలుగు వారాల్లోగా స్పందించాలని నిందితులకు నోటీసులు పంపింది.

కేరళలోని మూడు హైడ్రోఎలక్ర్టిక్‌ ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, కెనడాకు చెందిన ఎస్‌ఎన్‌సీ లావలిన్‌ కంపెనీల మధ్య ఒప్పందాలు, లావాదేవీల విషయంలో అనినీతి జరిగిందని కేసు నమోదైంది.

ఈ కేసులో విజయన్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేరళ హైకోర్టు విజయన్ వదిలేయడంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com