కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు
- January 11, 2018
దిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. ఎస్ఎన్సీ-లావలిన్ అవినీతి కేసులో ఆయనకు నోటీసులు పంపింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో సీబీఐ చేసిన అప్పీల్ను వినడానికి అంగీకరించింది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం అవసరమని, నిందితులందరికీ నోటీసులు పంపాలని సీబీఐ తరపు న్యాయవాది.. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరారు. సీబీఐ చేసిన అప్పీలును అంగీకరించిన కోర్టు నాలుగు వారాల్లోగా స్పందించాలని నిందితులకు నోటీసులు పంపింది.
కేరళలోని మూడు హైడ్రోఎలక్ర్టిక్ ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, కెనడాకు చెందిన ఎస్ఎన్సీ లావలిన్ కంపెనీల మధ్య ఒప్పందాలు, లావాదేవీల విషయంలో అనినీతి జరిగిందని కేసు నమోదైంది.
ఈ కేసులో విజయన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేరళ హైకోర్టు విజయన్ వదిలేయడంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజా వార్తలు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!









