కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు
- January 11, 2018
దిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. ఎస్ఎన్సీ-లావలిన్ అవినీతి కేసులో ఆయనకు నోటీసులు పంపింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో సీబీఐ చేసిన అప్పీల్ను వినడానికి అంగీకరించింది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం అవసరమని, నిందితులందరికీ నోటీసులు పంపాలని సీబీఐ తరపు న్యాయవాది.. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరారు. సీబీఐ చేసిన అప్పీలును అంగీకరించిన కోర్టు నాలుగు వారాల్లోగా స్పందించాలని నిందితులకు నోటీసులు పంపింది.
కేరళలోని మూడు హైడ్రోఎలక్ర్టిక్ ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, కెనడాకు చెందిన ఎస్ఎన్సీ లావలిన్ కంపెనీల మధ్య ఒప్పందాలు, లావాదేవీల విషయంలో అనినీతి జరిగిందని కేసు నమోదైంది.
ఈ కేసులో విజయన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేరళ హైకోర్టు విజయన్ వదిలేయడంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







