దక్షిణ ఇరాన్లో భూకంపం
- January 11, 2018
తెహ్రాన్ : కెర్మాన్ దక్షిణ ప్రాంతంలో భూమి కంపించినట్లు ఇరాన్ మీడియా అధికారులు పేర్కొన్నారు. రిక్టర్స్కేలుపై 5.1గా నమోదైనట్లు తెలిపారు. హొజిడెక్ గ్రామానికి 700 కిలోమీటర్లు, దక్షిణ తెహ్రాన్కు 400 మైళ్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టంకు సంబంధించి ఇంకా తెలియలేదని అన్నారు. భూమి కంపించగానే ఆ ప్రాంతవాసులు బయటకు పరుగులు తీసారని, మీడియా పేర్కొంది. కాగా, కెర్మాన్లో తరచూ భూకంపాలు వస్తుంటాయని, గతేడాది నవంబర్లో భూకంపం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ ఇరాన్లో వచ్చిన భూకంపం ధాటికి 600 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్లో చారిత్రాత్మక నగరమైన బామ్లో 2003లో వచ్చిన భూకంపం ధాటికి 26,000మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







