దక్షిణ ఇరాన్లో భూకంపం
- January 11, 2018
తెహ్రాన్ : కెర్మాన్ దక్షిణ ప్రాంతంలో భూమి కంపించినట్లు ఇరాన్ మీడియా అధికారులు పేర్కొన్నారు. రిక్టర్స్కేలుపై 5.1గా నమోదైనట్లు తెలిపారు. హొజిడెక్ గ్రామానికి 700 కిలోమీటర్లు, దక్షిణ తెహ్రాన్కు 400 మైళ్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టంకు సంబంధించి ఇంకా తెలియలేదని అన్నారు. భూమి కంపించగానే ఆ ప్రాంతవాసులు బయటకు పరుగులు తీసారని, మీడియా పేర్కొంది. కాగా, కెర్మాన్లో తరచూ భూకంపాలు వస్తుంటాయని, గతేడాది నవంబర్లో భూకంపం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ ఇరాన్లో వచ్చిన భూకంపం ధాటికి 600 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్లో చారిత్రాత్మక నగరమైన బామ్లో 2003లో వచ్చిన భూకంపం ధాటికి 26,000మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









