కతార్ లో నేటితో ముగుస్తున్న ధౌ పండుగ
- November 21, 2015
సాంప్రదాయిక పెరల్ డైవింగ్ (సముద్ర గర్భంలోకి వెళ్ళడం) పోటీతో సహా వివిధ అంశాలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేయడంతో, ఐదవ కతారా సంప్రదాయ ధౌ పర్వదినం నేటితో సమాప్తమవనుంది. మూడు రోజుల సౌదీ అరేబియా, కువైట్, బహరేన్, కతార్ మరియు ఒమాన్ దేశాల నుండి, హ్యాండ్ లైన్ ఫిషింగ్, రోయింగ్, ఉచ్చ లతో చేపలు పట్టడం, తెరచాపను ఎత్తడం, అల్ ఖత్ఫా మరియు సంప్రదాయ ధౌ పోటీలలో పాల్గొన్న వారిలో మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు అందించారు. ధౌ మరియు హస్తకళల ప్రదర్సన మాత్రమే కాకుండా, ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన బంగారం మరియు ముత్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. యాకుబ్ యుసేఫ్ అల్ మన్సౌరి అనే అధికారి, మహిళలు తమ బంగారు ఆభరణాలను కేవలం 30 సెకెన్లలో తనిఖీ చేసే మిషన్ సహాయంతో పరీక్షించుకోవడానికి వరుసలు కట్టారని, తద్వారా వినియోగదారులు బంగారు ఆభరణాలను కొనుగోలు చాల జాగ్రత్తగా చేస్తున్నారని గ్రహించామని, అదే విధంగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొనే అవకాసం కూడా ఈ ఉత్సవం కలిగించిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







