వలసదారులపై బీజేపీ వివక్షత చూపిస్తోంది : రాహుల్ గాంధీ
- January 14, 2018
బీజేపీ వివక్షాపూరితంగా ఆలోచిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇండియన్ మైగ్రెంట్ వర్కర్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని మండిపడ్డారు. ఇండియన్ పాస్పోర్టులలో మార్పులు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించడంపై రాహుల్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.
''భారతదేశ మైగ్రెంట్ వర్కర్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఈ చర్య బీజేపీకి ఉన్న వివక్షాపూరిత ఆలోచనా విధానాన్ని వెల్లడిస్తోంది'' అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రభుత్వం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ స్టేటస్ కోసం జారీచేసే పాస్పోర్టుల రంగు నారింజ వర్ణంలోకి మార్చుతున్నారు. విదేవీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ ఇకపై పాస్పోర్టులోని చివరి పేజీ ఖాళీగా ఉంటుందని చెప్పారు. ఈసీఆర్ స్టేటస్ ఉన్న పాస్పోర్టు హోల్డర్లకు నారింజ రంగు పాస్పోర్టు జాకెట్ జారీ చేస్తామన్నారు. నాన్ ఈసీఆర్ స్టేటస్ ఉన్నవారికి గతంలో మాదిరిగానే నీలి రంగు పాస్పోర్టులు కొనసాగుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









