వలసదారులపై బీజేపీ వివక్షత చూపిస్తోంది : రాహుల్ గాంధీ
- January 14, 2018
బీజేపీ వివక్షాపూరితంగా ఆలోచిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇండియన్ మైగ్రెంట్ వర్కర్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని మండిపడ్డారు. ఇండియన్ పాస్పోర్టులలో మార్పులు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించడంపై రాహుల్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.
''భారతదేశ మైగ్రెంట్ వర్కర్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఈ చర్య బీజేపీకి ఉన్న వివక్షాపూరిత ఆలోచనా విధానాన్ని వెల్లడిస్తోంది'' అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రభుత్వం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ స్టేటస్ కోసం జారీచేసే పాస్పోర్టుల రంగు నారింజ వర్ణంలోకి మార్చుతున్నారు. విదేవీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ ఇకపై పాస్పోర్టులోని చివరి పేజీ ఖాళీగా ఉంటుందని చెప్పారు. ఈసీఆర్ స్టేటస్ ఉన్న పాస్పోర్టు హోల్డర్లకు నారింజ రంగు పాస్పోర్టు జాకెట్ జారీ చేస్తామన్నారు. నాన్ ఈసీఆర్ స్టేటస్ ఉన్నవారికి గతంలో మాదిరిగానే నీలి రంగు పాస్పోర్టులు కొనసాగుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









