పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నటి అమలాపాల్
- January 16, 2018
ప్రముఖ నటి అమలాపాల్ నిన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఓ కారు వ్యవహారం లో ఆమె పోలీస్ విచారణ నిమిత్తం స్టేషన్ లో సరెండర్ అయ్యారు. అసలు వివరాల్లోకి వెళ్తే నటి అమలాపాల్ కొత్తగా రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన కారును పుదేచ్చేరిలో రిజిస్టర్ చేయించుకుంది.అక్కడ రోడ్డు రవాణా శాఖ పన్ను తక్కువ ఉండడమే అందుకు కారణం.అయితే పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయించుకున్న కారును కేరళాలో పన్ను కట్టకుండా నడపడంతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖకు నష్టం కలిగిందట. దాంతో అమలాపాల్పై కేరళలో సెక్షన్ 430, 468, 471 కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఇటీవల కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ కేసును తర్వాత పరిశీస్తామని చెప్పిన కోర్టు, అమలాపాల్ని వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









