ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు..
- January 17, 2018
తెలుగు జాతి వైభవాన్ని చాటి చెప్పింది ఎన్టీఆరే అన్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు వారి అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్టీఆర్ 22వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ కర్తవ్యమన్నారు. దేశం గర్వించేలా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తామన్నారు బాలకృష్ణ.. ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. హరికృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహా ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయాన్ని వక్రీకరించారంటూ విమర్శించారు లక్ష్మీపార్వతి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి