ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు..
- January 17, 2018
తెలుగు జాతి వైభవాన్ని చాటి చెప్పింది ఎన్టీఆరే అన్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు వారి అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్టీఆర్ 22వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ కర్తవ్యమన్నారు. దేశం గర్వించేలా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తామన్నారు బాలకృష్ణ.. ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. హరికృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహా ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయాన్ని వక్రీకరించారంటూ విమర్శించారు లక్ష్మీపార్వతి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







