ఫిబ్రవరి నుంచి మొదలుకానున్న వాట్సాప్ పేమెంట్స్
- January 17, 2018
ఎంతోకాలంగా ఊరిస్తున్న వాట్సాప్ ద్వారా చెల్లింపులు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ ద్వారా చెల్లింపులు సాధ్యమైతే దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా ఊపందుకుంటాయి. భారత్లో విస్తృత ఆదరణ పొందిన వాట్సాప్ తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపుల కోసం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లతో కలిసి పేమెంట్స్ ఫ్లాట్ఫాంకు సన్నాహాలు చేస్తోంది. ప్లాట్ఫాం ఇప్పటికే బీటా (టెస్టింగ్) దశలో ఉందని. ఫిబ్రవరి మాసాంతానికి ఇది సిద్ధమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు బ్యాంకులతో వాట్సాప్ డిజిటల్ పేమెంట్స్ ఫ్లాట్ఫాం ఏర్పాటుపై వివిధ దశల్లో కసరత్తు సాగుతోందని ఓ బ్యాంకర్ సైతం ధ్రువీకరించారు. డేటా భద్రతపై తాము సెక్యూరిటీ చెక్స్ నిర్వహిస్తున్నామని బ్యాంకర్ తెలిపారు. ఇంటిగ్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈ ప్రోడక్ట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేముందు ఎంపిక చేసిన యూజర్లతో దీన్ని పరీక్షిస్తామని చెప్పారు. యూపీఐతో వాట్సాప్ ఇంటిగ్రేషన్కు ఈ ఏడాది జులైలో ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గూగుల్ సహా పలు టెక్నాలజీ కంపెనీలు బ్యాంకులతో నేరుగా లింక్ అయ్యే ఇన్స్టాంట్ చెల్లింపుల సేవల్లోకి అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
తాజా వార్తలు
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్







