పారిస్‌లో అంతర్జాతీయ సదస్సు

- November 22, 2015 , by Maagulf
పారిస్‌లో అంతర్జాతీయ సదస్సు

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈనెల 14వ తేదీన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు మారహోమం సృష్టించిన విషయంతెల్సిందే. ఈ దాడి తర్వాత మెల్లగా కోలుకుంటున్న పారిస్ నగరం.. ఇపుడు ఓ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. వాతావరణ మార్పులు, భూతాపం అంశంపై జరిగే 21వ అంతర్జాతీయ సదస్సుకు పారిస్ నగరం వేదిక కానుంది. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు దాదాపు 120 మంది ప్రపంచ అధినేతలు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తెలిపారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పలు కార్యక్రమాలు, ర్యాలీలపై దీని ప్రభావితం పడింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఈనెల 29న నిర్వహించనున్న భారీ సన్నాహాక ర్యాలీని ఫ్రాన్స్‌ ప్రభుత్వం రద్దు చేసినట్లు ఐక్యరాజ్య సమితి సహాయ కార్యదర్శి జనరల్‌ జానోస్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com