పారిస్లో అంతర్జాతీయ సదస్సు
- November 22, 2015
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఈనెల 14వ తేదీన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు మారహోమం సృష్టించిన విషయంతెల్సిందే. ఈ దాడి తర్వాత మెల్లగా కోలుకుంటున్న పారిస్ నగరం.. ఇపుడు ఓ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. వాతావరణ మార్పులు, భూతాపం అంశంపై జరిగే 21వ అంతర్జాతీయ సదస్సుకు పారిస్ నగరం వేదిక కానుంది. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు దాదాపు 120 మంది ప్రపంచ అధినేతలు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తెలిపారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పలు కార్యక్రమాలు, ర్యాలీలపై దీని ప్రభావితం పడింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఈనెల 29న నిర్వహించనున్న భారీ సన్నాహాక ర్యాలీని ఫ్రాన్స్ ప్రభుత్వం రద్దు చేసినట్లు ఐక్యరాజ్య సమితి సహాయ కార్యదర్శి జనరల్ జానోస్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







