దుబాయ్లో ఉద్యోగాలంటూ మోసం, ఎయిర్ పోర్ట్ లో నిందితుడి అరెస్ట్
- January 20, 2018
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్కు చెందిన కర్మాగిల్ అన్బు జేమ్స్, భరత్లు సామాజిక మాధ్యమాల ద్వారా విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారు. దుబాయ్లోని షాపింగ్మాల్స్లో సేల్స్ సూపర్వైజర్లుగా ఉద్యోగాలిప్పిస్తామంటూ రెండేళ్ల క్రితం వీరిచ్చిన ప్రకటన ఆధారంగా హైదరాబాద్ శాంతి నగర్ వాసి కాంతి ఆనంద్.. కర్మాగిల్ను సంప్రదించింది. సేల్స్ మేనేజర్గా ఉద్యోగం ఇస్తామంటూ ఆమెను నమ్మించిన అతను..రూ.50 వేలు తన ఖాతాలో జమచేస్తే రెండు వారాల్లో వీసా పంపుతానని చెప్పాడు.
ఆమె ద్వారా మరో 14 మంది కూడా రూ.50 వేలు చెల్లించారు. తర్వాత రిజిస్ట్రేషన్, విమానాశ్రయంలో నిబంధనలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున దాదాపు రూ.37 లక్షల వరకూ దండుకున్న తర్వాత ఇద్దరూ తమ చరవాణిలు స్విచ్ఛాఫ్ చేశారు. కాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. కర్మాగిల్ దుబాయ్ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు డీసీపీ అవినాశ్ మహంతి తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







