దుబాయ్లో ఉద్యోగాలంటూ మోసం, ఎయిర్ పోర్ట్ లో నిందితుడి అరెస్ట్
- January 20, 2018
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్కు చెందిన కర్మాగిల్ అన్బు జేమ్స్, భరత్లు సామాజిక మాధ్యమాల ద్వారా విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారు. దుబాయ్లోని షాపింగ్మాల్స్లో సేల్స్ సూపర్వైజర్లుగా ఉద్యోగాలిప్పిస్తామంటూ రెండేళ్ల క్రితం వీరిచ్చిన ప్రకటన ఆధారంగా హైదరాబాద్ శాంతి నగర్ వాసి కాంతి ఆనంద్.. కర్మాగిల్ను సంప్రదించింది. సేల్స్ మేనేజర్గా ఉద్యోగం ఇస్తామంటూ ఆమెను నమ్మించిన అతను..రూ.50 వేలు తన ఖాతాలో జమచేస్తే రెండు వారాల్లో వీసా పంపుతానని చెప్పాడు.
ఆమె ద్వారా మరో 14 మంది కూడా రూ.50 వేలు చెల్లించారు. తర్వాత రిజిస్ట్రేషన్, విమానాశ్రయంలో నిబంధనలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున దాదాపు రూ.37 లక్షల వరకూ దండుకున్న తర్వాత ఇద్దరూ తమ చరవాణిలు స్విచ్ఛాఫ్ చేశారు. కాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. కర్మాగిల్ దుబాయ్ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు డీసీపీ అవినాశ్ మహంతి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









