నేను రాజమౌళికి కొత్త అభిమానిని : నైజీరియా దర్శకురాలు ఓషిన్
- January 19, 2018
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో భారీ వసూళ్లు సాధించటంతో పాటు భారతీయ సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈసినిమాపై అంతర్జాతీయ స్థాయి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో టాప్ డైరెక్టర్ చేశారు. నైజీరియాకు చెందిన మహిళా దర్శకురాలు టోపె ఓషిన్ ఇటీవల బాహుబలి సినిమాను చూసి సినిమాపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
బాహుబలి సినిమా రెండు భాగాలను మార్చి మార్చి చూసినట్టుగా వెల్లడించినా ఓషిన్, ఎలా స్పందించాలో అర్థం కావటం లేదని ట్వీట్ చేశారు. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్. సినిమా చూస్తున్నప్పుడు నాకు బాధ, ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిగాయి.నా మీద బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. బాహుబలి సినిమా కోసం ఎంత సమయమైనా కేటాయించ వచ్చు అందుకే స్క్రిప్ట్, ఎడిటింగ్ లాంటి చాలా పనులున్నా పక్కన పెట్టి సినిమా చూశాను. నేను మళ్లీ బాహుబలి గురించి ట్వీట్ చేయకుండా ఉండగలనేమో చూస్తాను. అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను కూడా చూస్తానని వెల్లడించారు ఓషిన్.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో