డబ్బింగ్ మొదలుపెట్టిన 'కాలా'
- January 21, 2018
చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'కాలా'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ను రజనీ మొదలు పెట్టారు. చెన్నైలోని ఓ స్టూడియోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నారు. 'కబాలి' తర్వాత రజనీ, పా రంజిత్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. ఇందులో తలైవా గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను రజనీ అల్లుడు, నటుడు ధనుష్ నిర్మిస్తున్నారు. తొలిభాగం చిత్రీకరణ ముంబయిలో, రెండో భాగం తమిళనాడులో జరిగింది. ఇందులో రజనీ భార్యగా ఈశ్వరీరావు నటిస్తున్నారు. బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ, నానా పటేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మరోపక్క రజనీ నటించిన '2.ఓ' సినిమా వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీజాక్సన్ కథానాయికగా నటించారు.
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. ఏప్రిల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
అయితే రజనీ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో సినిమాలకు స్వస్తి పలుకుతున్నారని వార్తలు వస్తున్నాయి.
'కాలా'నే ఆయన నటించే చివరి చిత్రం అని చెప్పుకొచ్చారు. అయితే దీని తర్వాత పొలిటికల్ నేపథ్యంలో ఓ సినిమా తీయాలని, అది ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని రజనీ భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







