'సాహో' షూటింగ్ కు దుబాయ్ గ్రీన్ సిగ్నల్
- January 21, 2018
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో.. ఈ మూవీకి రన్న రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకుడు.. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్.. ఈ మూవీ షూటింగ్ కు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.. దీంతో ఈ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 25నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభించనుంది.. మొత్తం 60 రోజుల పాటు అక్కడ షూటింగ్ కొనసాగిస్తారు.. ఫ్రఖ్యాత బుర్జ్ ఖలీఫా వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది.. వాస్తవానికి దుబాయ్ లో షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కావాలసి ఉంది.. అయితే షూటింగ్ చేయాలనుకున్న కొన్ని ప్రాంతాల్లో అనుమతులు రాలేదు. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసే పరిస్థితి కనిపించలేదు దీంతో మూడో షెడ్యుల్ జరగాల్సిన హైదరాబాద్ కు చిత్ర యూనిట్ తిరిగి వచ్చేసింది.. భాగ్యనగరంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు.ఇప్పుడు దుబాయ్ అనుమతులు రావడంతో కొంచెం బ్రేక్ తీసుకుని ఫిబ్రవరి 25 నుంచి అక్కడ షూటింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకుంది చిత్ర బృందం.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







