'సాహో' షూటింగ్ కు దుబాయ్ గ్రీన్ సిగ్నల్
- January 21, 2018
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో.. ఈ మూవీకి రన్న రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకుడు.. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్.. ఈ మూవీ షూటింగ్ కు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.. దీంతో ఈ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 25నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభించనుంది.. మొత్తం 60 రోజుల పాటు అక్కడ షూటింగ్ కొనసాగిస్తారు.. ఫ్రఖ్యాత బుర్జ్ ఖలీఫా వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది.. వాస్తవానికి దుబాయ్ లో షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కావాలసి ఉంది.. అయితే షూటింగ్ చేయాలనుకున్న కొన్ని ప్రాంతాల్లో అనుమతులు రాలేదు. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసే పరిస్థితి కనిపించలేదు దీంతో మూడో షెడ్యుల్ జరగాల్సిన హైదరాబాద్ కు చిత్ర యూనిట్ తిరిగి వచ్చేసింది.. భాగ్యనగరంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు.ఇప్పుడు దుబాయ్ అనుమతులు రావడంతో కొంచెం బ్రేక్ తీసుకుని ఫిబ్రవరి 25 నుంచి అక్కడ షూటింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకుంది చిత్ర బృందం.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







