'సాహో' షూటింగ్ కు దుబాయ్ గ్రీన్ సిగ్నల్
- January 21, 2018
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో.. ఈ మూవీకి రన్న రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకుడు.. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్.. ఈ మూవీ షూటింగ్ కు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.. దీంతో ఈ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 25నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభించనుంది.. మొత్తం 60 రోజుల పాటు అక్కడ షూటింగ్ కొనసాగిస్తారు.. ఫ్రఖ్యాత బుర్జ్ ఖలీఫా వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది.. వాస్తవానికి దుబాయ్ లో షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కావాలసి ఉంది.. అయితే షూటింగ్ చేయాలనుకున్న కొన్ని ప్రాంతాల్లో అనుమతులు రాలేదు. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసే పరిస్థితి కనిపించలేదు దీంతో మూడో షెడ్యుల్ జరగాల్సిన హైదరాబాద్ కు చిత్ర యూనిట్ తిరిగి వచ్చేసింది.. భాగ్యనగరంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు.ఇప్పుడు దుబాయ్ అనుమతులు రావడంతో కొంచెం బ్రేక్ తీసుకుని ఫిబ్రవరి 25 నుంచి అక్కడ షూటింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకుంది చిత్ర బృందం.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









