'సాహో' షూటింగ్ కు దుబాయ్ గ్రీన్ సిగ్నల్
- January 21, 2018
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో.. ఈ మూవీకి రన్న రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకుడు.. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్.. ఈ మూవీ షూటింగ్ కు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.. దీంతో ఈ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 25నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభించనుంది.. మొత్తం 60 రోజుల పాటు అక్కడ షూటింగ్ కొనసాగిస్తారు.. ఫ్రఖ్యాత బుర్జ్ ఖలీఫా వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది.. వాస్తవానికి దుబాయ్ లో షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కావాలసి ఉంది.. అయితే షూటింగ్ చేయాలనుకున్న కొన్ని ప్రాంతాల్లో అనుమతులు రాలేదు. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసే పరిస్థితి కనిపించలేదు దీంతో మూడో షెడ్యుల్ జరగాల్సిన హైదరాబాద్ కు చిత్ర యూనిట్ తిరిగి వచ్చేసింది.. భాగ్యనగరంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు.ఇప్పుడు దుబాయ్ అనుమతులు రావడంతో కొంచెం బ్రేక్ తీసుకుని ఫిబ్రవరి 25 నుంచి అక్కడ షూటింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకుంది చిత్ర బృందం.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!