అధిక వేతనాలకై జర్మనీలో కార్మికుల పోరాటం
- January 24, 2018
బెర్లిన్ : అధిక వేతనాలు కోరుతూ జర్మనీలోని కార్మిక సంఘాలు పోరు బాట పట్టాయి. దేశంలోని అత్యంత శక్తివంతమైన ఐజి మెటల్ యూనియన్ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. దేశంలోని కీలకమైన మెటల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు చెందిన దాదాపు 39లక్షల మంది కార్మికులకు ఈ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆరు శాతం వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వోక్స్వాగన్, బిఎండబ్ల్యు, బోష్, సీమెన్స్ వంటి కంపెనీలతో సహా పలు కంపెనీలు, సంస్థల్లో సమ్మె హెచ్చరికలతో 6లక్షల మందికి పైగా కార్మికులను సమీకరించారు. కంపెనీ యాజమాన్యాలతో బుధవారం కార్మిక సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించకపోతే వాకౌట్లు, సమ్మె తప్పదని ఐజి మెటల్ ఇప్పటికే హెచ్చరించింది. దేనికైనా సన్నద్ధంగా వున్నామని ఐజి మెటల్ నాయకుడు జార్జి హాఫ్మన్ గత వారమే తెలిపారు. ఈ విషయమై దేశంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇంటా బయటా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కార్మికులు చేసే డిమాండ్లు చాలా వ్యయభరితంగా వున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వారు కేవలం రెండు శాతం మాత్రమే పెంచుతామని ప్రతిపాదిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









