అధిక వేతనాలకై జర్మనీలో కార్మికుల పోరాటం
- January 24, 2018
బెర్లిన్ : అధిక వేతనాలు కోరుతూ జర్మనీలోని కార్మిక సంఘాలు పోరు బాట పట్టాయి. దేశంలోని అత్యంత శక్తివంతమైన ఐజి మెటల్ యూనియన్ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. దేశంలోని కీలకమైన మెటల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు చెందిన దాదాపు 39లక్షల మంది కార్మికులకు ఈ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆరు శాతం వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వోక్స్వాగన్, బిఎండబ్ల్యు, బోష్, సీమెన్స్ వంటి కంపెనీలతో సహా పలు కంపెనీలు, సంస్థల్లో సమ్మె హెచ్చరికలతో 6లక్షల మందికి పైగా కార్మికులను సమీకరించారు. కంపెనీ యాజమాన్యాలతో బుధవారం కార్మిక సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించకపోతే వాకౌట్లు, సమ్మె తప్పదని ఐజి మెటల్ ఇప్పటికే హెచ్చరించింది. దేనికైనా సన్నద్ధంగా వున్నామని ఐజి మెటల్ నాయకుడు జార్జి హాఫ్మన్ గత వారమే తెలిపారు. ఈ విషయమై దేశంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇంటా బయటా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కార్మికులు చేసే డిమాండ్లు చాలా వ్యయభరితంగా వున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వారు కేవలం రెండు శాతం మాత్రమే పెంచుతామని ప్రతిపాదిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







