అధిక వేతనాలకై జర్మనీలో కార్మికుల పోరాటం
- January 24, 2018
బెర్లిన్ : అధిక వేతనాలు కోరుతూ జర్మనీలోని కార్మిక సంఘాలు పోరు బాట పట్టాయి. దేశంలోని అత్యంత శక్తివంతమైన ఐజి మెటల్ యూనియన్ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. దేశంలోని కీలకమైన మెటల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు చెందిన దాదాపు 39లక్షల మంది కార్మికులకు ఈ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆరు శాతం వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వోక్స్వాగన్, బిఎండబ్ల్యు, బోష్, సీమెన్స్ వంటి కంపెనీలతో సహా పలు కంపెనీలు, సంస్థల్లో సమ్మె హెచ్చరికలతో 6లక్షల మందికి పైగా కార్మికులను సమీకరించారు. కంపెనీ యాజమాన్యాలతో బుధవారం కార్మిక సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించకపోతే వాకౌట్లు, సమ్మె తప్పదని ఐజి మెటల్ ఇప్పటికే హెచ్చరించింది. దేనికైనా సన్నద్ధంగా వున్నామని ఐజి మెటల్ నాయకుడు జార్జి హాఫ్మన్ గత వారమే తెలిపారు. ఈ విషయమై దేశంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇంటా బయటా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కార్మికులు చేసే డిమాండ్లు చాలా వ్యయభరితంగా వున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వారు కేవలం రెండు శాతం మాత్రమే పెంచుతామని ప్రతిపాదిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







