అభివృద్ధి బాటలో మయన్మార్ శాంతి క్రమం
- January 24, 2018
యాంగాన్ : మయన్మార్ శాంతి క్రమం పురోగతి బాటలో పయనిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం (ఎన్సిఎ)తో చేతులు కలుపుతామంటూ రెండుకు పైగా సాయుధ గ్రూపులు ప్రకటించాయి. మంగళవారం ప్రభుత్వ సలహాదారు ఆంగ్సాన్ సూకీ, రక్షణ విభాగ కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాయింగ్లతో సమావేశం అనంతరం న్యూ మోన్ స్టేట్ పార్టీ (ఎన్ఎంఎస్పి), లాహు డెమోక్రటిక్ యూనియన్ (ఎల్డియు)లు త్వరలో ఎన్సిఎపై సంతకాలు చేయడానికి అంగీకరించాయి. ఈ మేరకు రెండు పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ రెండు పార్టీల నేతలు యునైటెడ్ నేషనాలిటీస్ ఫెడరల్ కౌన్సిల్ (యుఎన్ఎఫ్సి)లో సభ్యులు. కాల్పుల విరమణయేతర గ్రూపునకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. సమావేశం అనంతరం సూకీ పత్రికల వారితో మాట్లాడుతూ, శాంతి క్రమం దిశగా పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







