అభివృద్ధి బాటలో మయన్మార్ శాంతి క్రమం
- January 24, 2018
యాంగాన్ : మయన్మార్ శాంతి క్రమం పురోగతి బాటలో పయనిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం (ఎన్సిఎ)తో చేతులు కలుపుతామంటూ రెండుకు పైగా సాయుధ గ్రూపులు ప్రకటించాయి. మంగళవారం ప్రభుత్వ సలహాదారు ఆంగ్సాన్ సూకీ, రక్షణ విభాగ కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాయింగ్లతో సమావేశం అనంతరం న్యూ మోన్ స్టేట్ పార్టీ (ఎన్ఎంఎస్పి), లాహు డెమోక్రటిక్ యూనియన్ (ఎల్డియు)లు త్వరలో ఎన్సిఎపై సంతకాలు చేయడానికి అంగీకరించాయి. ఈ మేరకు రెండు పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ రెండు పార్టీల నేతలు యునైటెడ్ నేషనాలిటీస్ ఫెడరల్ కౌన్సిల్ (యుఎన్ఎఫ్సి)లో సభ్యులు. కాల్పుల విరమణయేతర గ్రూపునకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. సమావేశం అనంతరం సూకీ పత్రికల వారితో మాట్లాడుతూ, శాంతి క్రమం దిశగా పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







