చైనా విదేశాంగ మంత్రి చెంగ్ ఫెన్జియాంగ్ అమరావతిలో పర్యటన
- November 23, 2015
చైనా విదేశాంగ సహాయక మంత్రి చెంగ్ ఫెన్జియాంగ్ తన బృందంతో సోమవారం రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా యంత్రాంగం వారికి అతిథి మర్యాదలతో స్వాగతం పలికి రాజధాన్ని ప్రాంతాన్ని చూపించింది. ఉండవల్లి నుంచి కరకట్ట మార్గాన బయలుదేరి ఉద్ధండరాయునిపాలెం, రాయపూడి, అమరావతిని సందర్శించింది. గుంటూరు కలెక్టర్ కాంతీలాల్ దండే, కృష్ణ కలెక్టర్ బాబు, సీఆర్డీఏ అధికారులు చైనా బృందానికి అమరావతి విశిష్టతను వివరించారు. విజయవాడ నుంచి బయలు దేరిన బృందం ముందుగా శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ పోలీసు గౌరవవందనం స్వీకరించింది. అనంతరం అమరావతి త్రీడీ మ్యాప్ను పరిశీలించింది. మ్యాప్ను గురించి కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ వారికి వివరించారు. యాగశాల, నీరు మట్టి ఉంచిన ప్రదేశం, శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి పెన్జీంగ్ యాంగ్ ఫాటోలు తీసుకున్నారు. వాటి గురించి ఎమ్మెల్యే వివరించారు. తరువాత రాయపూడి చేరుకుని మిక్కిలి ప్రసాద్ గుడిసెను పరిశీలించారు. వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు చైనా దేశానికి చెందిన జ్ఞాపికను అందజేశారు. వంద డాలర్ల ఆర్థిక సాయం అందించారు. అదే గ్రామంలో ఎంపీపీ పురాతన భవనాన్ని సందర్శించాల్సి ఉండగా సమయం చాలక అమరావతి ధ్యానబుద్ధ వద్దకు బయలుదేరి వెళ్లారు. అమరావతి సందర్శన అమరావతి: చైనా బృందం అమరావతిలోని మహాచైత్యం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పురావస్తు ప్రదర్శనశాలను సందర్శించింది. అమరావతికి సంబందించిన బౌద్ద చారిత్రక అంశాలను మ్యూజియం అధికారి కన్నబాబు వారికి వివరించచారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు సమాచారాన్ని సాంఘీక సంక్షేమశాఖ జేడీ మల్లిఖార్జునరావు వివరించారు. వారి వెంట గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు కాంతీలాల్ దండే, బాబు, గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణనాయక్, సీనియర్ ప్రిన్సిపల్ కార్యదర్శి పీవీ రమేష్, ప్రోటోకాల్ అధికారి అశోక్బాబు, టూరిజం డైరక్టర్ అమరేంద్ర, ఆర్డీవో భాస్కరనాయుడు, డీఎస్పీ మధుసూదనరావు, అమరావతి, తుళ్లూరు తహశీల్దార్ నాసరయ్య, సురేంద్రబాబు, సీఐ హనుమంతరావు తదితరులు ఉన్నారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







