అనంతపురాన్ని దత్తత తీసుకోనున్న లోకేష్ నారా
- January 29, 2018
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అధికార టిడిపి నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాలలో భాగంగా పంచాయితీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ నేడు అనంతపురం లో పర్యటించారు. అనంతపురం తో తనకు వున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్న ఆయన ఈ సందర్భంగా ఒక సంచలన ప్రకకటన చేశారు. త్వరలోనే తాను అనంతపురాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆరునెలల పాటు బస్ లో పడుకుని పరిపాలన చేసే పరిస్థితి నుంచి నేడు రాజధాని నిర్మాణం చేపట్టే వరకు వచ్చామని ఆయన తెలిపారు.రాష్ట్రం లో చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నాయకులు తమ పార్టీ లో చేరుతున్నారని అన్నారు. గోదావరి, కృష్ణ నదులను కలిపినా ఘనత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుకె దక్కుతుందని ఆయన అన్నారు. దేశం లో అతి చిన్న వయసులోనే మంత్రిని అయ్యానని, చిన్నప్పుడే నాన్న గారు గ్రామాలకు తన వంతు సేవ చేయాలని చెప్పడంతో పంచాయితీరాజ్ శాఖను ఎంచుకన్నానని ఆయన తెలిపారు. జగన్ తన పేపర్ లో ఎల్ ఈ డి బల్బుల పంపిణీ లో కుంభకోణం జరిగిందని రాయడం విడ్డూరమని, దమ్ముంటే ఆధారాలతో బయట పెట్టాలని. ఒక దొంగ పేపర్, దొంగ ఛానల్ ని నడుపుతున్న జగన్ అతి పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు...
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







