అనంతపురాన్ని దత్తత తీసుకోనున్న లోకేష్ నారా
- January 29, 2018
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అధికార టిడిపి నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాలలో భాగంగా పంచాయితీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ నేడు అనంతపురం లో పర్యటించారు. అనంతపురం తో తనకు వున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్న ఆయన ఈ సందర్భంగా ఒక సంచలన ప్రకకటన చేశారు. త్వరలోనే తాను అనంతపురాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆరునెలల పాటు బస్ లో పడుకుని పరిపాలన చేసే పరిస్థితి నుంచి నేడు రాజధాని నిర్మాణం చేపట్టే వరకు వచ్చామని ఆయన తెలిపారు.రాష్ట్రం లో చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నాయకులు తమ పార్టీ లో చేరుతున్నారని అన్నారు. గోదావరి, కృష్ణ నదులను కలిపినా ఘనత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుకె దక్కుతుందని ఆయన అన్నారు. దేశం లో అతి చిన్న వయసులోనే మంత్రిని అయ్యానని, చిన్నప్పుడే నాన్న గారు గ్రామాలకు తన వంతు సేవ చేయాలని చెప్పడంతో పంచాయితీరాజ్ శాఖను ఎంచుకన్నానని ఆయన తెలిపారు. జగన్ తన పేపర్ లో ఎల్ ఈ డి బల్బుల పంపిణీ లో కుంభకోణం జరిగిందని రాయడం విడ్డూరమని, దమ్ముంటే ఆధారాలతో బయట పెట్టాలని. ఒక దొంగ పేపర్, దొంగ ఛానల్ ని నడుపుతున్న జగన్ అతి పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు...
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి







