సమంత చరణ్ ల డ్యూయెట్ క్యాన్సిల్కు కారణం
- January 29, 2018
రంగస్థలం' టీజర్ వచ్చాక వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాక సినిమా ఎలా ఉంటుందో అని భయపడ్డ చరణ్ అభిమానుల భయాలు పూర్తిగా తొలిగిపోయాయి. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో ఈసినిమాలోని పాత్రల పరిచయం పేరుతో చిన్నచిన్న బిట్ టీజర్లు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట సుకుమార్.ప్రస్తుతం చివరి దశలో ఉన్న 'రంగస్థలం' షూటింగ్ లో లీడ్ యాక్టర్స్ లో రామ్ చరణ్ అనసూయ మాత్రమే పాల్గొంటున్నారని తెలుస్తోంది. సమంత ఇప్పుడున్న షెడ్యూల్ లో లేదు అని సమాచారం. అయితే సుకుమార్ చరణ్ సమంత లతో కొత్త తరహాలో ఒక రొమాంటిక్ సాంగ్ తీయాలని భావించి ఆపాటకు సంబంధించిన ట్యూన్ ను కూడ ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ చేత ట్యూన్ చేయించినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు ఆ రొమాంటిక్ పాట చిత్రీకరణ ఆలోచనను క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సమంత అని అంటున్నారు. అక్కినేని కోడలుగా సమంత మారిన తరువాత ఆమె తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి ఎక్స్ పోజింగ్ సీన్స్ ను అంగీకరించడం లేదని టాక్. దీనితో సమంత సున్నితంగా ఈ రొమాంటిక్ సాంగ్ కు నో చెప్పింది అని అంటున్నారు.అయితే సమంత ఇలా నిర్ణయం తీసుకోవడం వెనుక వేరే కారణం ఉంది అని మరికొందరంటున్నారు. ప్రస్తుతం సమంత తన డేట్స్ అన్నీ 'మహానటి' సినిమాకు ఇచ్చేయడంతో ఆమెకు వేరే మార్గం లేక సుకుమార్ కు ఇలా నో చెప్పింది అని మరికొందరి అభిప్రాయం. ఈసినిమా విడుదలకు సంబంధించి ఇక కేవలం 60 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆఖరి రోజులలో ఎటువంటి హడావిడి ఉండకూడదని సుకుమార్ టీమ్ ప్రస్తుతం ఈసినిమాకు సబంధించి టీం డే అండ్ నైట్ వర్క్ చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







