కార్పొరేషన్లో విలీనానికి గొల్లపూడి పంచాయతీ గ్రీన్సిగ్నల్
- January 29, 2018
విజయవాడ: గొల్లపూడి గ్రామ పంచాయతీని విజయవాడ నగరపాలకసంస్థలో విలీనంచేసేందుకు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సర్పంచ్ సాధనాల వెంకటేశ్వరమ్మ తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో సభ్యులు పలు సూచనలతో కూడిన 'విలీన' తీర్మానాన్ని ఆమోదించారని చెప్పారు. గ్రామ పరిధిలోని ఖాళీ స్థలాలకు విలీనం తేదీ నుంచి పది సంవత్సరాల పాటు పన్ను మినహయించా లని, పంచాయతీ సిబ్బందిని, కాంట్రాక్టు కార్మికులను నగరపాలకసంస్థలో రెగ్యులర్ చేసి కొనసాగించాలని, సూచించినట్టు తెలిపారు.
పైడూరుపాడు పాలకవర్గ సమావేశం కూడా తమ గ్రామాన్ని విజయవాడ నగరంలో విలీనం చేసేందుకు తీర్మానించిందని ఆ పంచాయతీ కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు.
రాయనపాడు నో..
విజయవాడ నగరంలో విలీనాన్ని రాయనపాడు పంచాయతీ తిరస్కరించింది. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో 'విలీన' తీర్మానం వీగిపోయింది. తీర్మానంపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ఓటింగ్ నిర్వహించారు. 12 మంది సభ్యుల్లో ఆరుగురు అనుకూలంగా, ఆరుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో సర్పంచ్ తలారి అరుణ కుమారి ఓటు ప్రత్యేకమైంది. ఆమె కూడా వ్యతిరేకంగా ఓటు వేయడంతో విలీనానికి నో చెప్పినట్టయింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు