క్షమాబిక్ష కాలం మొదలుకావడంతో ప్రవాసులతో కువైట్ రాయబార కార్యాలయం
- January 30, 2018
కువైట్:సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే కువైట్ లోని భారత దౌత్య కార్యాలయం(ఎంబసీ) వద్ద వేలాదిమంది బారులు తీరేరు. ఒక్కసారిగా వేలాది మంది రావడంతో దౌత్య కార్యాలయ అధికారులతోపాటు కువైత్ అధికారులు విస్తుపోయారు. కువైత్లో పనులకు మన దేశం నుంచి సుమారు 40 సంవత్సరాలుగా భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. కువైట్ లో వివిధ వృత్తుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారే సుమారు 5 లక్షల మంది వరకు అక్కడ ఉంటున్నారు.అయితే ఏజెంట్లు, దళారులు, అక్కడి యజమానుల మోసాల వల్ల వేలాదిమంది అకామా, పాస్పోర్టు, ఆ దేశ గుర్తింపు కార్డు బతాకా కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుమతి పత్రాలు లేని సుమారు 50 వేల మందికిపైగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నట్టు సమాచారం. పాస్పోర్టు, అకామా, బతాకా లేకుండా ఆ దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న వారు అపరాధరుసుము, శిక్షలు లేకుండా ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు స్వదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతి ఇస్తూ కువైత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాసంతో ఇల్లు చేరేందుకు మన దేశానికి చెందిన అలాంటివారంతా మన ఎంబసీ వద్ద బారులు తీరుతున్నారు. తొలిరోజు(సోమవారం) భారీగా భారత దౌత్య కార్యాలయం ఎదుట వేలాదిమంది క్యూ కట్టారు. వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఆ దేశ అనుమతి పత్రాలు లేని వారు మన దౌత్య కార్యాలయానికి వెళ్లి తమ వద్ద ఉన్న పత్రాలు సమర్పిస్తే, అన్ని వివరాలు పరిశీలించి భారత్కు రావడానికి అధికారులు అనుమతి ఇస్తారు. అవుట్పాస్ జారీ చేస్తారు.ఈ అవుట్పాస్ను ఇమిగ్రేషన్ కార్యాలయంలో ఇస్తే, కువైట్ లో కేసులేమీ లేనట్టు ధ్రువీకరించుకొని ఇమిగ్రేషన్ ముద్ర వేసి, విమాన టికెట్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా వారం రోజుల్లో పూర్తి కానుంది.
తాజా వార్తలు
- యువత భవితను మార్చనున్న 'వివేకానంద మానవ వికాస కేంద్రం
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!







