సందీప్ రెడ్డి డైరెక్షన్ లో మహేష్ బాబు!
- January 30, 2018
ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమాలు చేయాలని టాప్ డైరెక్టర్స్ అంతా ఉత్సాహ పడుతూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే మహేష్ కూడ తన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ టాప్ డైరెక్టర్స్ తోనే ఎక్కువగా చేసాడు. కొత్త దర్శకులను మహేష్ ప్రోత్సహించిన సందర్భాలు చాల తక్కువ.అయితే అలా పెద్ద అనుకున్న దర్శకులే మహేష్ కు గత కొన్నేళ్లలో దారుణమైన ఫలితాలనందించారు. 'శ్రీమంతుడు' మినహా గత నాలుగేళ్లలో మహేష్ నటించిన నాలుగు సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మిగిలిన విషయం తెలిసిందే. కనీసం మురగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా మహేష్ ను పరాజయాల నుంచి కాపాడలేక పోయాడు.ఇలాంటి పరిస్థుతులలో 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పిన కథకు మహేష్ అంగీకరించాడు అన్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరిచాయి. దీనితో మహేష్ కూడ తన పద్ధతిని మార్చుకుని కొత్త దర్శకుల వైపు చూస్తున్నాడా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈమధ్యనే సందీప్ రెడ్డి మహేష్ ల మధ్య జరిగిన సమావేశంలో 'షుగర్ ఫ్యాక్టరీ' ప్రస్తావన వచ్చినట్లు టాక్.వాస్తవానికి ఈ షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ తో సందీప్ రెడ్డి తయారుచేసిన కథను 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత మళ్ళీ విజయ్ దేవర కొండ తోనే కొంత గ్యాప్ తీసుకుని తీయాలి అని అనుకున్నాడట. అయితే ఆ కథకు అన్నివిధాల మహేష్ సరిపోతాడు అని సందీప్ రెడ్డితో పాటు మహేష్ కూడ భావించడంతో ఇప్పుడు ఈ 'షుగర్ ఫ్యాక్టరీ' స్క్రిప్ట్ రచన పరుగులు పెడుతోంది అని అంటున్నారు. ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు నిలబెట్టాలి అని భావిస్తున్న మహేష్ ఆలోచనలకు సందీప్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







