లండన్లో ప్రవాస భారతీయ ఉద్యోగుల నిరసనలు
- January 31, 2018
లండన్ : బ్రిటన్ రాజధాని లండన్లో ప్రవాస భారతీయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. బ్రిటన్ ప్రభుత్వం రద్దు చేసిన ద టయర్-1 ( జనరల్) వీసాలను పునరుద్ధరించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు వందలాది మంది నిరసనకారులు డౌనింగ్ స్ట్రీట్కు చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళనలో డాక్టర్లు, ఐటీ ఇంజినీర్లు, ఉపాధ్యాయులు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరిసా మే 2011లో బ్రిటన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. నైపుణ్యమున్న ఉద్యోగులకు బ్రిటన్ ప్రభుత్వం మంజూరు చేస్తూ వస్తున్న ద టయర్ 1( జనరల్ ) వీసా విధానాన్ని ఆమె రద్దు చేశారు. ఈ విషయమై అప్పట్లో బ్రిటన్లో నిరసనలు వెల్లువెత్తాయి. బ్రిటన్ ప్రభుత్వం నేటికీ ద టయర్-1 వీసాలను పునరుద్ధరించడంగానీ, పొడిగించడం కానీ చేయకపోవడంతో భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశస్థులు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద టయర్-1 వీసాల పొడిగింపు లేకపోవడం, నైపుణ్యమున్న ఉద్యోగులకు తగిన ప్రోత్సాహం లభించకపోవడంతో బ్రిటన్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వేలాది కుటుంబాలు బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటన్ ఆర్థికాభివృద్ధి కోసం పన్నులు చెల్లించి తామంతా పాటుపడుతున్నప్పటికీ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని భరద్వాజ్ అనే నిరసనకారుడు తన ఆవేదనను వెలిబుచ్చాడు.
తాజా వార్తలు
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!
- సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!







